చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో హీరో మోటోకార్ప్ ప్లాంట్
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారతదేశంలో కెల్లా తమ ఆరవ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో చదువుకున్నాం. కాగా.. ఇప్పుడు ఆ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో ఏర్పాట చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో హీరో మోటో కార్ప్ ప్లాంట్ ఏర్పాటుకు కావల్సిన భూమి సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గత సోమవారం హీరో మోటో కార్ప్ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులతో ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు.

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెం వద్ద మొత్తం 592 ఎకరాల భూమిని హీరో మోటోకార్ప్కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం హీరో మోటోకార్ప్ రూ.1,600 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటు వలన పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.
ఈ కొత్త ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వచ్చినట్లయితే, ఈ ప్లాంట్ ప్రతి ఏటా 1.8 మిలియన్ మోటార్సైకిళ్లు మరియు సైకిళ్లు ఉత్పత్తి అవుతాయి. ఇది హీరో మోటోకార్ప్కు భారతదేశంలో 6వ ప్లాంట్, ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి వస్తే, కంపెనీ మొత్తం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం 12 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications








