టూ వీలర్ టైర్లను పరిచయం చేసిన బ్రిడ్జిస్టోన్
- దేశీయ టూ వీలర్ల విపణిలోకి జపాన్ సంస్థ బ్రిడ్జిస్టోన్ ఎంట్రీ.
- NERUN బ్రాండ్ పేరుతో బైకులు మరియు స్కూటర్ల టైర్ల ఉత్పత్తి.
జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జిస్టోన్ దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి చాలా కాలమే అయినప్పటకీ, తాజాగా టూ వీలర్ సెగ్మెంట్లోని బైకులు మరియు స్కూటర్ల కోసం టైర్లను ప్రవేశపెట్టింది. వీటిని NERUN అనే పేరుతో అందుబాటులోకి తెచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా మోటోజిపి బైకుల కోసం 2009 నుండి 2015 వరకు టైర్లను సరఫరా చేసిన ఏకైక సంస్థ బ్రిడ్జిస్టోన్.
బ్రిడ్జిస్టోన్ NERUN బ్రాండ్ పేరుతో ఐదు విభిన్నమైన సైజులలో టైర్లను అందిస్తోంది. ఇవి మార్కెట్లో ఉన్న 70 శాతం అవసరాలను తీర్చనున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న బ్రిడ్జిస్టోన్ అవుట్ లెట్లలో ఈ టైర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: ఫేస్బుక్లో బైక్ అమ్మకానికి పెట్టినందుకు, ఇంత క్రూరంగా చంపడమా ?
టైర్ల మార్కెటింగ్ మంచి అవకాశాలున్న దేశాలలో భారత దేశం ఒకటి. ఇక్కడ సుమారుగా 150 మిలియన్ టూ వీలర్లు ప్రస్తుతం రోడ్ల మీద ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా టూ వీలర్ల మార్కెట్ వృద్ది 8.5 శాతం ఉంది. బ్రిడ్జిస్టోన్ సంస్థ అన్ని రకాల టూవీలర్లకు కావాల్సిన రకరకాల టైర్లను అందిస్తుందని తెలిపింది.
Also Read: మోటో గుజ్జి నుండి వి9 బోబర్ మరియు రోమర్


Click it and Unblock the Notifications








