20.06 లక్షల ధరతో దేశీయ విపణిలోకి డుకాటి మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ విడుదల
ఇటాలియన్కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ డుకాటి ఇండియన్ మార్కెట్లోకి మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ ఎడిషన్ను విడుదల చేసింది. మల్టీస్ట్రాడా స్పెషల్ ఎడిషన్ ధర రూ. 20.06 లక్షలు ఎక్స్ షోరూమ్గా ఉంది.

డుకాటి సంస్థ దీనిని విడుదల కంటే ముందుగా గత వారంలో జరిగిన 2016 పైక్స్ పీక్ హిల్ క్లైంబ్ ఈవెంట్లో ప్రదర్శించారు.

లిమిటెడ్ ఎడిషన్ ఈ మల్ట్రీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ స్పెషల్ ఎడిషన్ను లిమిటెడ్ ఎడిషన్ ఎడిషన్గా కేవలం 400 వరకు మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు.

మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్లో డుకాటి సంస్థ 1198.4 సీసీ సామర్థ్యం ఉన్న ఎల్-ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ను అందించారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 160బిహెచ్పి పవర్ మరియు 136ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయును. ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ను 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా వెనుక చక్రానికి అందుతుంది.

ప్రత్యేకతలు
మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ బైకులో పూర్తి స్థాయిలో అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటున్న ఓహ్లిన్స్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు టిటిఎక్స్36 రియర్ షాక్ అబ్జార్వర్ను అందించారు.

కార్బన్ ఫైబర్
ఈ బైకులో ప్లాస్టిక్ పదార్థాన్ని వినియోగించాల్సిన చోట కార్బన్ ఫైబర్ను ఎక్కువగా వినియోగించారు. దీనికి ముఖ్య కారణం, టెర్మిగ్నోని వారి కార్బన్ ఫైబర్ సైలెన్సర్లను వినియోగించే బైకులు ఎంతో శక్తివంతమైనవి. అందుకే ఇందులో కార్బన్ ఫైబర్ను వినియోగించారు.

భద్రత ఫీచర్లు
డుకాటి సంస్థ ఇందులో కార్నరింగ్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పూర్తి స్థాయిలో ఎల్అఇడి హెడ్లైట్లను వినియోగించిన కార్నరింగ్ లైట్లు, డుకాటి వీలి కంట్రోల్, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ కలవు

స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటిని వినియోగించుకుని రైడర్ బైకును కంట్రోల్ చేయవచ్చు.

మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ బైకు విడుదల సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్ డైరక్టర్ రవి అవలూరు మాట్లాడుతూ, " ఇండియాలోకి విడుదలైన ఈ టూరింగ్ బైకు రైడింగ్ ఔత్సాహికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దీని డిజైన్ మరియు పనితీరు ఎంతగానో ఆకర్షిస్తుందని తెలిపారు".

డుకాటి మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ ఎడిషన్ వైట్ రెడ్ మరియు బ్లాక్ లివరీతో పాటు ఎర్రటి ఛాసిస్ ఉండేవిధంగా డిజైన్ చేసారు.

ప్రస్తుతం ఇండియాలోని అన్ని డుకాటి షోరూమ్లలో ఇది అందుబాటులో ఉటుంది. దేశ వ్యాప్తంగా డుకాటి సంస్థకు ఢిల్లీ, గుర్గావ్, ముంబాయ్, పూనే మరియు బెంగళూరు వంటి నగరాలలో షోరూమ్లు కలవు.

ఇక్కడ విమానం దింపాలంటే ఆ ఎనిమిది మంది మాత్రమే అర్హులు


Click it and Unblock the Notifications








