త్వరలో చిత్తూరు హీరోమోటోకార్ప్ ప్లాంట్ అందుబాటులోకి
హీరో మోటోకార్ప్ తమ చిత్తూరు ప్లాంటు ను 2018 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తికి సిద్దం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్లాంటును హీరోమోటోకార్ప్ శ్రీ సిటిలోని మదనపాలెమ్కు దగ్గరలో ఉన్న ఎకనామిక్ జోన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంటు నిర్మాణానికి సంభందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు హీరోమోటోకార్పు సంస్థ పరస్పరం ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసుకున్నాయి.

హీరోమోటోకార్ప్ చిత్తూరులో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ కోసం దాదాపుగా 800 కోట్ల రుపాయలను పెట్టుబడిగా వినియోగించుకుంటోంది. ఈ ప్లాంటు ద్వారా ప్రారంభంలో 1500 మందికి మరియు ఆ తరువాత 3,500 మంది వరకు ప్రాంతీయులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపింది.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు
చిత్తూరునూతన ప్లాంటు ద్వారా ఏడాదికి ఐదు లక్షల వరకు ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ ప్లాంటు కేంద్రంగా ఎలక్ట్రిక్ వాహనాలు, త్రీ వీలర్స్, డిఫెన్స్ టెక్నాలజీ, ఏరోస్పేస్ మరియు ఇతర రంగాలకు చెందిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయా సంస్థల ఉమ్మడి ఒప్పందాల ప్రకారం అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు.



Click it and Unblock the Notifications








