మహీంద్రా గస్టో 110 స్పెషల్ ఎడిషన్ విడుదల: బుకింగ్స్ ప్రారంభం
పండుగ సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో చాలా వరకు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వీలైనంత వరకు అమ్మకాలను సాధించడానికి తమ ఉత్పత్తులను స్పెషల్ ఎడిషన్ రూపంలో అందివ్వడం ప్రారంభించాయి. అందులో మహీంద్రా సంస్థ కూడా ఒకటి. మహీంద్రా టూ వీలర్స్ లిమిటెడ్ (MTWL) రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ రెండూ కూడా గస్టో 110 ఆధారంతో రూపొందించబడ్డాయి.

ఈ రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను భారత దేశపు అతి పెద్ద మొబైల్ పేమెంట్ మరియు ఈ-కామర్స్ దిగ్గజం పేటిఎమ్ వేదిక నుండి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

రెండు స్పెషల్ ఎడిషన్ గస్టో స్కూటర్లు రెండు విభిన్నమైన రంగుల్లో లభించును. అవి, పసిఫిక్ మ్యాట్ బ్లూ మరియు క్రిమ్సన్ మ్యాట్ రెడ్. రెండు స్కూటర్లు కూడా సరికొత్త బీజి పెయింట్ ఇంటీరియర్ ప్యానెల్స్ను కలిగి ఉన్నాయి.

స్పెషల్ ఎడిషన్ గస్టో 110 స్కూటర్లను 5,000 రుపాయల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎడిషన్ గస్టో స్కూటర్లలో రంగులు మినహాయించి మరే ఇతర మార్పులు చోటు చేసుకోలేదు.

సాంకేతికంగా ఇందులో 109.6సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ సుమారుగా 8బిహెచ్పి పవర్ మరియు 8.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయును.

- సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో
- 85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్
- మెర్సిడెస్ బెంజ్ భవిష్యత్ వ్యాన్లు ఇలా ఉండనున్నాయి...!!


Click it and Unblock the Notifications








