రెట్రో స్టైల్లో మహీంద్రా మోజో బైకులు
మహీంద్రా సంస్థ కొనుగోలు చేసిన బిఎస్ఎ సంస్థలోని పురాతణ డిజైన్ల ఆధారంగా తమ మోజో బైకులను రెట్రో స్టైల్లో అభివృద్ది చేసారు.
మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ బిఎస్ఎ మరియు జావా సంస్థలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బిఎస్ఎ సంస్థలోని పురాతణ మోడళ్ల డిజైన్ ఆధారంగా మోజో ఉత్పత్తులను రూపొందించారు. రైడింగ్ ఔత్సాహికులు దీనిని చూసారంటే ఖచ్చితంగా ఎంచుకుంటారని చెప్పవచ్చు.

బిఎస్ఎ మరియు జావా సంస్థల యొక్క పురాతణ డిజైన్ సాంకేతిక ద్వారా తమ నూతన ఉత్పత్తులను అభివృద్ది చేసి 2019 నాటికి దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది.

డిజిటల్ ఆర్టిస్ట్ జకుసా డిజైన్ సంస్థ మహీంద్రా మోజో ఉత్పత్తులను బిఎస్ఎ మోటార్ సైకిళ్ల డిజైన్ ఆధారంతో రెట్రో ఔఓట్ఫిట్గా డిజైన్ చేసింది. ఇప్పుడు మోజో ఉత్పత్తులు స్టిన్నింగ్గా ఉన్నాయి.

గుండ్రంగా ఉన్న హెడ్ ల్యాంప్ మరియు పొట్టిగా, మందంతో ఉన్న హ్యాండిల్ బార్ కాస్త ప్రత్యేకంగా ఉంది. జకుసా డిజైన్ వారు క్రితం మోజో లోని అదనపు విడిభాగాలను తొలగించి ఉన్న వాటిని కాస్త అభివృద్ది చేసి బైకును డిజైన్ చేశారు.

కండలు తిరిగిన ఇంధన ట్యాంకు స్థానంలో వాలుగా, కాస్త గుండ్రటి ఆకారంలో ఉన్న ఇంధన ట్యాంకును అభివృద్ది చేసారు. ట్యాంక్ పై భాగం మీద క్రోమ్ ఫినిషింగ్ చేశాడు.

పురాతరణ మోడల్ స్టైల్లోని రూపం తెప్పించడానికి ముందున్న రైడర్ సీటును పూర్తిగా తొలగించి. న్యారో స్టెప్ సీటును అందించారు.

రెట్రో డిజైన్ స్టైల్ను తలపించే రీతిలో ఉన్న ఈ మోజో ఉత్పత్తుల ఫోటోలలో జకుసా డిజైన్ వారు దీనికి అవే అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

రెండు ఎగ్జాస్ట్ పైపులు మరియు డిస్క్ బ్రేకులు కలవు.
చితృ కృప: Jakusa Design

- ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో విడుదలవుతున్న కార్లు, వాటి వివరాలు
- లీకైన 2017 బజాజ్ పల్సర్ 180 చిత్రాలు: నూతనంగా సంతరించుకున్న మార్పులేంటి ?
- నెక్ట్స్ జెనరేషన్ క్రెటా 7 సీటింగ్ సామర్థ్యంతో: హ్యుందాయ్


Click it and Unblock the Notifications








