రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ దిశగా పావులు కదుపుతున్న మహీంద్రా
సబ్సిడరీ క్లాసిక్ లెజెండ్స్ సంస్థ వారి జావా (JAWA) బైకుల తయారీ మరియు అమ్మకాల కోసం మహీంద్రా టూ వీలర్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
"జావా" ఇప్పుడు ఇండియాలో పరిచయం కానున్న మోటార్ సైకిల్. 1950 ల కాలంలో Czechoslovakian అనే సంస్థ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ తరువాత 1996లో ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే మహీంద్రా టూ వీలర్స్ ఈ సంస్థకు చెందిన జావా బైకును అభివృద్ది చేసి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

మహీంద్రా టూ వీలర్స్ ఈ పురాతన జావా మోటార్ సైకిల్ను అందుబాటులోకి తీసుకువస్తే, ప్రస్తుతం పోటీనే ఎరుగని రాయల్ ఎన్ఫీల్డ్ వారి ఉత్పత్తులకు బ్రేక్ పడే అవకాశం ఉంది.

సబ్సిడరీ సంస్థకు చెందిన ఇకానిక్ మోటార్ సైకిల్ జావా కు చెందిన తయారీ మరియు అమ్మకాలకు సంభందించి ఇరు సంస్థలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ప్రస్తుతం అందుబాటులోకి రానున్న జావా బైకు యొక్క గుణ, గణ, లక్షణాలు జావా బ్రాండ్ పేరుతో రానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మహీంద్రా తమ టూ వీలర్లను ఉత్పత్తి చేస్తున్న మధ్య ప్రదేశ్లోని పితాంపుర్ ప్లాంటులో ఈ జావా బైకులను తయారు చేయనుంది.

పితాంపుర్ మహీంద్రా టూ వీలర్ ప్రొడక్షన్ ప్లాంటులో ప్రస్తుతం సెంచ్యురో, గస్టో, మోజో వంటి ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.

2006 ప్రకారం, 125సీసీ, 250సీసీ మరియు 500సీసీ సామర్థ్యంతో జావా బైకులు ఉత్పత్తి చేయబడ్డాయి. బిఎమ్డబ్ల్యూ ఎఫ్ 650 లో గుర్తించినటువంటి 650సీసీ సామర్థ్యం ఉన్న పెద్ద రోటాక్స్ ఇంజన్లతో కూడా ఉత్పత్తి చేయబడింది.

జావా లోని 350సీసీ సామర్థ్యం ఉన్న రెండు సిలిండర్ల 2-స్ట్రోక్స్ ఇంజన్లు 1960 నుండి కొనసాగుతూనే వచ్చయి. మెకానికల్ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

జావా 350సీసీ బైకులు అత్యంత నమ్మకమైనవి. ఇవి ప్రస్తుతం మద్య అమెరికా మరియు రష్యా మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నాయి.

ప్రస్తుతం జావా 2014 మోడల్కు చెందిన JAWA50, JAWA125, JAWA250,JAWA350 మరియు JAWA660 స్పోర్టార్డ్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

ఇండియా లో జావా 1950 లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. కర్ణాకటకలోని మైసూర్ ఆధారిత ఐడియల్ జావా ఇండియా లిమిటెడ్ పేరుతో 1960లో పూర్తి స్థాయిలో పురుడు పోసుకుంది.

zechoslovakia దేశం కేంద్రంగా ప్రారంభమైన ఉత్పత్తులు CZ jawa చిహ్నాన్ని కలిగి ఉండేవి. దేశీయంగా ఉత్పత్తయ్యే జావా బైకుల మీద ఉన్న అదే చిహ్నంలో అదనంగా సున్నా వచ్చేది.

ఇండియాలో ఇప్పటికీ జావా శ్రేణి ఉత్పత్తులను ప్రేమించే ఔత్సాహికులు చాలా మందే ఉన్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ వారి బైకుల అమ్మకాల్లో వాటాను సొంతం చేసుకోవడానికి మహీంద్రా జావా బైకులను విడుదల చేయనుంది. దీనికి సంభందించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.

ఆధునిక సాంకేతిక మరియు ఫీచర్ల జోడింపుతో క్లాసిక్ స్టైల్ను కొనసాగిస్తూ భారత్ స్టేజ్ 6 ఉద్గార నియమాలను పాటించే విధంగా అభివృద్ది చేయడం అనే సవాళ్లు ఇప్పుడు మహీంద్రా ముందు ఉన్నాయి.

- ఈ కొత్త కారుతో మార్కెట్ను కుదిపేయడం ఖాయం అంటున్న మారుతి
- పాకిస్తాన్కు ఆల్టో660: తీవ్రవాద దేశానికి ఇంత ఆవశ్యకత ఎందుకు ?
- ఉద్గార రహిత బస్సులను ప్రారంభించిన ఘనత వీరిదే...!!


Click it and Unblock the Notifications








