కొత్త గ్రాఫిక్స్తో స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ విడుదల చేసిన టీవీఎస్
దేశీయ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ టీవీఎస్ ఇండియన్ స్కూటర్ల సెగ్మెంట్లోకి సరికొత్త స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ను విడుదల చేసింది. అమ్మాయిలు మరియు మహిళలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటర్ను కేవలం రూ. 42,534 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేసింది. నయా స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

2016 స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్లో 87.8సీసీ గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇది సుమారుగా 4.9 బిహెచ్పి పవర్ మరియు 5.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని ఇంజన్కు టీవీఎస్ సంస్థ సివిటి ట్రాన్స్మిషన్ను అందించారు. తద్వారా ఇది లీటర్కు 65 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

టీవీఎస్ ఈ స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ లో నూతనంగా మల్టీ కర్వ్ ఇగ్నిషన్ సిస్టమ్ను కల్పించారు.

ఫీచర్లు పరంగా దీనికి వినియోగించిన ఛాసిస్ ఎక్కువ రిజిడిటి గల ఛాసిస్ను వినియోగించారు. మొబైల్ ఛార్జర్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇందులో కలదు.

ప్రస్తుతం టీవీఎస్ వీటిని దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద అందుబాటులో ఉంచింది.

టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ల మీద ఐదేళ్ల వరకు వారంటీని పొడగించింది.

ఇండియన్ IRNSS పరిజ్ఞానానికి అమెరికా కుదేలు కావాల్సిందే...!!
బాలీవుడ్ తారలకు ఇష్టమైన బైకులు
అబ్బాయిల కోసం యమహా నుండి సరికొత్త సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్


Click it and Unblock the Notifications








