జూలై 2016 లో రికార్డుల మోత మోగించిన యమహా ఇండియా
యమహా మోటార్స్ ఇండియా దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి కొన్ని అద్భుతమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. జపాన్ ఆధారిత సంస్థ గడిచిన జూలై 2016 అమ్మకాల్లో 12 శాతం వృద్దిని సాధించింది. ఈ అమ్మకాల్లో బైకులు మరియు స్కూటర్లు రెండు కూడా ఉన్నాయి.

అయితే సరిగ్గా ఏడాది క్రితం జూలై 2015 లో యమహా మోటార్స్ ఇండియా 58,477 ద్విచక్ర వాహనాల అమ్మకాలను జరిపింది. ఈ ఏడాది జూలైలో 65,244 యూనిట్ల అమ్మకాలను జరిపింది. 12 శాతం వృద్దిలో నేపాల్లో జరిగిన అమ్మకాలు కూడా కారణమయ్యాయి.
తాజాగ యమహా మోటార్ ఇండియా సిగ్నస్ ఆల్పా డిస్క్ బ్రేక్ వర్షెన్ మరియు సిగ్నస్ రే-జడ్ఆర్ స్కూటర్లను విడుదల చేసింది. ప్రస్తుతం స్కూటర్ల మార్కెట్లోకి యమహా అందించిన అన్ని ఉత్పత్తులు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. దీనికి యమహా అమ్మకాలే నిదర్శనం మరియు విసృత స్థాయిలో ఉత్పత్తులను అందించే ఆలోచనలో యమహా ఉంది.
Also Read: 125సీసీ సెగ్మెంట్లో ఉన్న ఆరు ఉత్తమ మైలేజ్ బైకులు
దేశీయంగానే కాకుండా కొన్ని రకాల ఉత్పత్తులు ఎగుమతి కూడా అవుతున్నాయి. అందులో సెల్యూటో మరియు సెల్యూటో ఆర్ఎక్స్ వంటి వాటిని త్వరలోనే ఎగుమతి చేస్తున్నట్లు యమహా ప్రకటించింది.


Click it and Unblock the Notifications