డిఎస్కె హ్యోసంగ్ అక్విలా 250 లిమిటెడ్ ఎడిషన్ విడుదల
డిఎస్కె హ్యోసంగ్ దేశీయ విపణిలోకి అక్విలా 250 లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్ను విడుదల చేసింది.
డిఎస్కె హ్యోసంగ్ ఇండియన్ క్రూయిజర్ బైక్ సెగ్మెంట్లోకి తమ అక్విలా 250 మోటార్ సైకిల్ను లిమిటెడ్ ఎడిషన్గా విడుదల చేసింది. డిఎస్కె హ్యోసంగ్ అక్విలా 250 లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 2.94 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

డిఎస్కె హ్యోసంగ్ దేశవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లలో మాత్రమే లిమిటెడ్ ఎడిషన్గా అందుబాటులో ఉంచింది. కస్టమర్లు వీటిని మూడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, మ్యాట్ బ్లాక్, మ్యాట్ గ్రీన్ మరియు డెసెర్ట్ బ్రౌన్.

సాంకేతికంగా ఈ లిమిటెడ్ ఎడిషన్లో సాధారణ హ్యోసంగ్ అక్విలా 250 లోని 249సీసీ సామర్థ్యం ఉన్న డిఒహెచ్సి వి-ట్విన్ ఇంజన్ అందివ్వడం జరిగింది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గల గేర్బాక్స్ అనుసంధానం కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 9,500ఆర్పిఎమ్ వద్ద 26.2బిహెచ్పి పవర్ మరియు 7,000ఆర్పిఎమ్ వద్ద 21.37ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఈ లిమిటెడ్ ఎడిషన్ డిఎస్కె హ్యోసంగ్ అక్విలా 250లో 14-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు, ముందు వైపు డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు కలవు.

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి క్రూయిజ్ సెగ్మెంట్ ద్వారా డామినర్ 400 మోటార్ సైకిల్ను ఊహించని ధరతో విడుదల చేసి మంచి అమ్మకాలు సాగిస్తోంది. ఓ సారి మీరు కూడా ఈ బజాజ్ డామినర్ 400 గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి...


Click it and Unblock the Notifications








