జిఎస్టి ప్రభావం: కెటిఎమ్ బైకుల మీద పెరిగిన ధరలు
కెటిఎమ్ విక్రయించే అన్ని మోడళ్ల మీద ధరలు పెరిగాయి. గరిష్టంగా రూ. 5,797 ల వరకు పెరిగాయి. పెరిగిన ధరలు జూలై 1, 2017 నుండి అమల్లోకి రానున్నాయి.
భారత ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానం వస్తు మరియు సేవల పన్ను (GST)ను జూలై 1, 2017 నుండి అమలు చేయనుంది. కెటిఎమ్ తమ అన్ని మోటార్ సైకిళ్ల మీద జిఎస్టికి అనుగుణంగా ధరలను సవరించింది.

కెటిఎమ్ విక్రయించే అన్ని మోడళ్ల మీద ధరలు పెరిగాయి. గరిష్టంగా రూ. 5,797 ల వరకు పెరిగాయి. పెరిగిన ధరలు జూలై 1, 2017 నుండి అమల్లోకి రానున్నాయి.

కెటిఎమ్ డ్యూక్ 200 మీద రూ. 4,063 ల వరకు పెరిగి 1.47 లక్షలుగా ఉంది. కెటిఎమ్ ఆర్సి 200 మీద రూ. 4,787 పెరిగిన తరువాత దీని ధర రూ. 1.76 లక్షలుగా ఉంది.

కెటిఎమ్ తాజాగా విడుదల చేసిన డ్యూక్ 250 మీద రూ. 4,427 ల వరకు పెరిగి దీని మొత్తం ధర రూ. 1.77 లక్షలుగా ఉంది. అదే విధంగా కెటిఎమ్ డ్యూక్ 390 మీద చాలా తక్కువ మేర ధర పెరిగింది, అయితే ప్రస్తుతం దీని ధర రూ. 2.26 లక్షలుగా ఉంది.

కెటిఎమ్ ఆర్సి390 మోటార్ సైకిల్ మీద రూ. 5,797 లు పెరిగిన అనంతరం, దీని ధర రూ. 2.31 లక్షలుగా ఉంది. కెటిఎమ్ మోటార్ సైకిళ్ల మీద జిఎస్టికి అనుగుణంగా సవరించబడిన అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
నూతన ట్యాక్స్ విధానం జిఎస్టి ప్రకారం, ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల ధరలు ప్రస్తుతం ఉన్న వాటికంటే పెరగనున్నాయి. అయితే తక్కువ కెపాసిటి ఉన్న బైకుల ధరలు స్వల్పంగా తగ్గుముఖంపట్టనున్నాయి.
టూ వీలర్లు మరియు కార్ల మీద జిఎస్టి ప్రభావం తెలుసుకోవడానికి డ్రైవ్స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి....


Click it and Unblock the Notifications








