Just In
- 30 min ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 1 hr ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 2 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో, యమహా మరియు టీవీఎస్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్కు నిరాకరిస్తున్న తమిళనాడు ఆర్టిఓలు
బిఎస్-III వాహనాల బ్యాన్ అనంతరం ఇండియన్ టూ వీలర్ల మార్కెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంది. దానికి ఇప్పుడు మరొకటి వచ్చి చేరింది. తమిళనాడులో కొత్త బిఎస్-IV టూ వీలర్ల రిజిస్ట్రేషన్ను ఆర్టిఓలో నిలిపివేశాయి
నిజమా...!
అని
ఆశ్చర్యపోతున్నారా..?
నిజమే
తమిళనాడులోని
ఆర్టిఓలు
కొత్త
యమహా,
హీరో
మరియు
టీవీఎస్
టూ
వీలర్ల
రిజిస్ట్రేషన్ను
నిలిపివేశాయి.
దీనికి
కారణం
ఏంటో
తెలుసా...?
దీనికి
కూడా
ఆ
భారత్
స్టేజ్
ఉద్గార
నియమాలే
అని
తెలియడంతో
ద్విచక్ర
వాహన
కొనుగోలుదారులు
తలలు
పట్టుకుంటున్నారు.
దీనికి
వెనకున్న
అసలు
కారణాలేంటో
చూద్దాం
రండి...
తమిళనాడులోని రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు నూతన యమహా, హీరో మరియు టీవీఎస్ టూ వీలర్లను ఏప్రిల్ 17, 2017 నుండి రిజిస్ట్రేషన్లను నిలిపివేశాయి.
బిస్-III మరియు బిఎస్-IV ఉద్గార నియమ నిబంధనలలో మరింత క్లారిటీ కోసం తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసిన తమిళనాడు ఆర్టిఓ అధికారులు పేర్కొన్నారు. బిఎస్-III మరియు బిఎస్-IV టూ వీలర్లపై మరింత స్పష్టత కోరుకుంటున్నట్లు తెలిపారు.
నూతన రెగ్యులేషన్కు అనుగుణంగా బిస్-III మరియు బిఎస్-IV వాహనాలను వేరుగా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలకు సంభందించిన పత్రాలు ఇంకా అందుబాటులో లేకపోవడం వలనే వీటి రిజిస్ట్రేషన్లకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 1, 2017 నుండి బిఎస్-III వాహనాల రిజిస్ట్రేషన్ను శాశ్వతంగా రద్దు చేయాలని సుప్రీం కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 1, 2017 తరువాత బిఎస్-IV వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగాల్సి ఉండగా ముందస్తు ప్రకటన లేకుండా అధికారులు బిఎస్-IV వాహనాల రిజిస్ట్రేషన్ అడ్డుకుంటున్నారు.
యమహా మోటార్ ఇండియా మాట్లాడుతూ, రవాణా శాఖ కమీషనర్ను కలిసి, కావాల్సిన డాక్యుమెంట్లు మరియు స్పష్టత ఇచ్చినట్లు తెలిపింది. అయితే డ్యాక్యుమెంట్ల సమర్పణ మరియు స్పష్టత ఇవ్వడంలో బజాజ్ మరియు హోండా ముందులో ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, కోయంబత్తూరు మరియు మదురైలలోని ఆర్టిఓలు బజాజ్ మరియు హోండాతో పాటు ఏ ఒక్క సంస్థకు చెందిన టూ వీలర్ రిజిస్ట్రేషన్ను పూర్తిగా నిలిపేశాయి. అదే విధంగా చెన్నైలో యమహా, టీవీఎస్ మరియు హీరో టూ వీలర్ల రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు.
యమహా మోటార్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఆర్టిఓ అధికారులకు కావాల్సిన పత్రాలు మరియు బిఎస్-IV రెగ్యులేషన్కు సంభందించిన స్పష్టతను ఇచ్చామని, మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని కస్టమర్లకు ధీమా వ్యక్తం చేసింది.