Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విద్యుత్ స్కూటర్లతో దూసుకొస్తున్న మరో ఇండియన్ టూ వీలర్ కంపెనీ
ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఉన్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించింది.
దక్షిణ భారత దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఉన్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించింది. ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ టూ వీలర్లను ప్రవేశపెట్టడం మరియు వాటి అభివృద్ది పరమైన పనులను వేగవంతం చేస్తోంది.
ద్విచక్ర వాహన పరిశ్రమలో తమకున్నపరిజ్ఞానంతో విద్యుత్ ద్వారా నడిచే టూ వీలర్లను తయారు చేసి, వాటిని విపణిలోకి విడుదల చేయనున్నట్లు చెన్నై ఆధారిత టూ వీలర్ల కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
టీవీఎస్ కమ్యూటర్ మోటార్సైకిల్స్, స్కూటర్స్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ," భవిష్యత్ రవాణాలో విద్యుత్ వాహనాలు కీలకంగా మారనున్నాయి. దానికనుగుణంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు."
Recommended Video
ఎలక్ట్రిక్ టూ వీలర్లను విడుదల చేసే సమయం గురించి మాట్లాడుతూ, అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపాడు. అయితే, ఎలాంటి స్కూటర్లు లేదా బైకులు ఉంటాయనే వివరాలను వెల్లడించడానికి నిరాకరించాడు.
ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ మరియు లోహియా కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమలో ప్రముఖంగా ఉన్నాయి. అదే విధంగా బజాజ్ అర్బనైట్ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను విడుదల చేయనున్నట్లు ఈ మధ్యనే స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,000 నుండి 20,000 యూనిట్ల మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. అయితే పెట్రోల్ స్కూటర్ల విషయానికి వస్తే ఏడాదికి 1.7 కోట్ల స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు అధికంగా ఉండటమే.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టీవీఎస్ మోటార్స్ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్లోకి ప్రవేశించడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఇప్పటకే పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను అభివృద్ది చేసింది. దీనికి తోడు బజాజ్ ఆటో అర్బనైట్ బ్రాడ్ పేరుతో ఎకో ఫ్రెండ్లీ టూ వీలర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.