Just In
- 4 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 4 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 6 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 7 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రపంచపు అతి పెద్ద హోండా టూ వీలర్ల ప్రొడక్షన్ ప్లాంటు ఇప్పుడు ఇండియాలో
ప్రపంచపు అతి పెద్ద హోండా టూ వీలర్ల తయారీ ప్లాంటును ఇండియాలో ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్లు ఇండియాలోనే ఉన్నాయి.
మార్కెట్, తయారీ మరియు మానవ వనరుల పరంగా ఇండియాలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని దేశ, విదేశీ సంస్థలు ప్రపంచ రికార్డులను నెలకొల్పుతున్నాయి. అందులో ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగానికి భారత్ స్వర్గధామంగా మారింది. బైకులు, కార్లు, బస్సులు మరియు లారీ లను దేశీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో ఉత్పత్తి చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
జపాన్ దిగ్గజం హోండా టూ వీలర్స్ మార్కెట్ అవకాశాల కోసం భారత్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచపు అతి పెద్ద హోండా టూ వీలర్ల తయారీ ప్లాంటును ఇండియాలో ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్లు ఇండియాలోనే ఉన్నాయి.
Recommended Video
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలో గల నర్సాపుర హోండా టూ వీలర్ల ప్రొడక్షన్ ప్లాంటులో మరో కొత్త అసెంబ్లీ లైన్ ప్రారంభించింది. ఇదే ప్రొడక్షన్ ప్లాంటులో మొత్తం నాలుగు అసెంబ్లీ లైన్లు ఉన్నాయి.
బెంగళూరు మహానగరానికి వెలుపల ఉన్న ఈ ప్రొడక్షన్ ప్లాంటు విస్తరణలో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హోండా టూ వీలర్ల ప్లాంట్లలో ఈ ప్లాంటు ఇప్పుడు అతి పెద్దదిగా నిలిచింది.
మేకిన్ ఇండియా చొరవతో, ఇటు హోండా టూ వీలర్స్కు అటు భారత్ రెండింటికి కూడా ఈ అరుదైన విజయం సాధ్యమైంది. హోండా అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్ హోండా ఆఫ్రికా ట్విన్ లాంచి చేసిన తరువాత. హోండా అధికారికంగా నాలుగవ లైన్ అసెంబ్లీ యూనిట్ ప్రారంభించింది.
ప్రపంచ టూ వీలర్ల మార్కెట్లో హోండా టూ వీలర్స్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రొడక్షన్ ప్లాంట్లను హోండా నెలకొల్పింది మరియు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలు వినియోగించే ఉత్పత్తులకు అనుగుణంగా అన్ని రకాల టూ వీలర్లను ఉత్పత్తి చేస్తోంది. చిన్న చిన్న స్కూటర్ల నుండి సూపర్ బైకులు హోండా లైనప్లో ఉన్నాయి. ప్రపంచపు దిగ్గజ టూ వీలర్ల సంస్థకు ఇండియాలో అతి పెద్ద ప్రొడక్షన్ ప్లాంటు ఉంది.
హోండా టూ వీలర్ల సంస్థకు ఇండియా అతి పెద్ద మార్కెట్గా ఉంది. మరియు ప్రపంచ మార్కెట్ వాటాలో మేజారిటీ షేర్ ఇండియాలోనే ఉండటం విశేషం. భారీ పెట్టుబడులతో హోండా ముందుకు రావడం మరియు ఇండియాలో మంచి మార్కెట్ అవకాశాలు ఉండటంతో దేశవ్యాప్తంగా హోండా నాలుగు తయారీ యూనిట్లను నెలకొల్పింది.
హోండా తమ తొలి తయారీ యూనిట్ను హర్యాణాలోని మానేసర్ లో ఏర్పాటు చేసింది. ఏడాదికి 16 లక్షల 50 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంటు మొత్తం 100,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది.
ఆ తరువాత హోండా తమ రెండవ ప్రొడక్షన్ ప్లాంటును రాజస్థాన్ లోని టపుకరా ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాక 2012-2013 ఆర్థిక సంవత్సరంలో హోండా టూ వీలర్ ఇండియా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 28 లక్షలకు చేరుకుంది.
హోండా టూ వీలర్స్ మూడవ ప్రొడక్షన్ ప్లాంటును 2013లో కర్ణాటకలో కోలార్ జిల్లాలోని నర్సాపూర్లో నెలకొల్పింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్యాక్టరీగా చెప్పుకునే ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 12 లక్షలు యూనిట్లుగా ఉంది.
హోండా తమ నాలుగవ ప్రొడక్షన్ ప్లాంటును గుజరాత్లోని విథలపూర్లో కేవలం స్కూటర్ల తయారీ కోసం మాత్రమే ఏర్పాటు చేసింది. ఇండియాలో ఏకైక స్కూటర్ల తయారీ ప్లాంటుగా మరియు ప్రపంచపు అతి పెద్ద స్కూటర్ల తయారీ ప్లాంటుగా నిలిచింది. ఈ తయారీ యూనిట్లో ఏడాదికి 12 లక్షల హోండా స్కూటర్లు ఉత్పత్తి అవుతున్నాయి.
హోండా నర్సాపుర ప్రొడక్షన్ ప్లాంటులో నాలుగవ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద హోండా టూ వీలర్ల ప్రొడక్షన్ ప్లాంటుగా నిలిచింది. ఈ ప్లాంటులో హోండా డ్రీమి యుగా, సిబిషైన్ మరియు ఎస్పి షైన్ మోడళ్లు తయారయ్యేవి, నాలుగవ లైన్ ప్రారంభంతో ఇప్పుడు హోండా ఆక్టివా మరియు డియో స్కూటర్లను ఉత్పత్తి చేయవచ్చు.
నర్సాపుర తయారీ యూనిట్ విస్తరణకు జపాన్ సంస్థ హోండా టూ వీలర్స్ ఏకంగా 665 కోట్ల పెట్టుబడి పెట్టింది. విస్తరణ చేపట్టడంతో ఏడాదికి ఆరు లక్షల యూనిట్లు ప్రొడక్షన్ పెరిగింది దీంతో రోజు వారీ ప్రొడక్షన్ 2,350 యూనిట్లుగా ఉంది.
ప్లాంటు విస్తరణ అనంతరం జరిగిన కార్యక్రమంలో హోండా మోటార్ కంపెనీ జపాన్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు డైరక్టర్ షింజి అయోమా మాట్లాడుతూ," హోండా టూ వీలర్స్కు ఇండియా అతి ముఖ్యమైన మార్కెట్ మరియు హోండాకు అత్యుత్తమ వృద్దిని సాధించి పెడుతోంది. హోండా గ్లోబల్ సేల్స్లో 30 శాతం వాటా ఇండియన్ మార్కెట్దే ఉందని తెలిపాడు."
హోండా నర్సాపుర ప్రొడక్షన్ ప్లాంటు పర్యావరణహితమైనది. వర్షపు నీటితో హార్వెస్టింగ్ మరియు ప్లాంటులో వినియోగించే విద్యుత్లో 80 శాతం సోలార్ ప్యానెల్స్ నుండి ఉత్పిత్తి అవుతోంది.