Just In
- 5 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 25 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జావా మోటార్ సైకిల్ విడుదలను ఖరారు చేసిన ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఇండియన్ మార్కెట్లో జావా మోటార్సైకిల్స్ కంపెనీ పునరుజ్జీవనానికి సమయం ఆసన్నమైందని ఆనంద్ మహీంద్రా తాజాగా చేసి ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు.
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్రీమియం టూ-వీలర్ల వ్యాపారంలో భాగంగా 2016లో జావా మరియు బిఎస్ఎ బ్రాండ్లను సొంతం చేసుకుంది. తమ భాగస్వామ్య దిగ్గజం క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్(CLPL) ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా, ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా మహీంద్రా ఉత్పత్తి చేయనున్న జావా మోటార్సైకిల్స్ గురించిన టీజర్ను ట్వీట్ చేశాడు.
ఇండియన్ మార్కెట్లో జావా మోటార్సైకిల్స్ కంపెనీ పునరుజ్జీవనానికి సమయం ఆసన్నమైందని ఆనంద్ మహీంద్రా తాజాగా చేసి ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. కానీ, ట్విట్టర్లో ఉపయోగించిన ఫోటో మాత్రం 2002 యమహా వైజడ్ఎఫ్-ఆర్1.
|
అయితే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాలోని తాజా ట్వీట్ మేరకు, మహీంద్రా అండ్ మహీంద్రా అతి త్వరలో జావా మోటార్సైకిల్స్కు పునరుజ్జీవం ఇస్తున్నట్లు గుర్తుచేస్తున్నాడు. జావా బైక్ ప్రేమికుల కోసం అతి త్వరలో కార్యకవాపాలను మహీంద్రా అండ్ మహీంద్రా ప్రారంభించనుంది.
గతంలో నవంబరు 2017న మహీంద్రా చేసిన ప్రకటన ప్రకారం, మొదటి జావా బైకును మార్చి 2019 లోపు విడుదల చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. మహీంద్రా జావా మోటార్సైకిల్ బ్రాండు పేరు క్రింద ప్రీమియం సెగ్మెంట్లో నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. వీటి కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక జావా విక్రయ కేంద్రాలను కూడా ప్రారంభించనుంది.
ఇటీవల విడుదలైన సమచారం మేరకు, అప్ కమింగ్ జావా బైకుల కోసం మహీంద్రా వారి మోజో 300సీసీ ఇంజన్ ఫ్లాట్ఫామ్ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొదటి జావా మోటార్ సైకిల్ను కూడా 300సీసీ ఇంజన్ రేంజ్లో, అదే ఇంజన్ కెపాసిటీతో మహీంద్రా మోజో ఫ్లాట్ఫామ్ మీద నిర్మించనున్నారు.
2018మే నెలలో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన కంపెనీ జావా 350 స్పెషల్ కఫే రేసర్ బైకును యూరోపియన్ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. జావా మోటార్సైకిల్స్ సుసంపన్న రేసింగ్ వారసత్వాన్ని పురస్కరించుకుని జావా 350 స్పెషల్ బైకును రూపొందించింది. అదే మునుపటి డిజైన్ను ప్రతిబింబించే పలు డిజైన్ అంశాలతో ఈ స్పెషల్ ఎడిషన్ బైకును నిర్మించారు.
జావా 350 స్పెషల్ ఎడిషన్ బైకులో సాంకేతికంగా 397సీసీ కెపాసిటి గల ట్విన్-ప్యార్లల్ ఇంజన్ కలదు, ఇది 27.6బిహెచ్పి పవర్ మరియు 30.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ను చైనా తయారీదారు నుండి సేకరించారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఈ మధ్య కాలంలో మోడ్రన్ డిజైన్లో ఉన్న బైకుల కంటే పాత కాలం నాటికి క్లాసిక్ డిజైన్ శైలిలో ఉన్న బైకుల మార్కెట్ శరవేగంగా పుంజుకుంటోంది. అత్యంత పురాతణమైన జావా మోటార్సైకిల్ బైకులకు అభిమానులు భారీగా ఉన్నారు. మహీంద్రా పరమైన ఈ జావా కంపెనీ నుండి కొత్త తరం బైకులు అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల అవుతాయని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పరోక్షంగా ట్వీట్ చేస్తూ తెలిపాడు.