Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్యూబ్ లెస్ టైర్లు తో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసిన హీరో
హీరో ఎలక్ట్రిక్.. డాష్ అనే కొత్త స్కూటర్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఆప్టిమా ఈ5 మరియు ఎన్వైసి ఈ5 ఉత్పత్తులతో సహా తన ఎంట్రీ లెవల్ రేంజ్ ఆఫరింగ్ ల్లో భాగంగా ఉంటుంది. హీరో డాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48వోల్ట్ 28ఆంపియర్/ గం లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.
దీంతో ఒక్క సారి చార్జ్ చేస్తే గరిష్టంగా 60కిమీ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్ లో నాలుగు గంటల్లో 0 నుండి 100 శాతం ఛార్జింగ్ అవుతుంది, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. హీరో డాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఉపయోగించడం చాలా సులభం అని, అధిక నాణ్యత కలిగిన ఈ ఉత్పత్తిని కూడా సులువుగా మెయింటైన్ చేయవచ్చని చెప్పారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది, అందువల్ల 145మి.మీ పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అందిస్తుంది. డ్యాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కొత్త ఫీచర్లను కలిగి ఉంది.
ఇందులో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డ్రిల్స్, ట్యూబ్ లెస్ టైర్లు, ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ తో స్పోర్టివ్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్, రిమోట్ బూట్ ఓపెనింగ్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ మరియు డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
సోహిందర్ గిల్ (CEO, హీరో ఎలక్ట్రిక్ ఇండియా) మాట్లాడుతూ, "హీరో ఎలక్ట్రిక్, స్మార్టర్ మొబిలిటీ పరిష్కారాలను ఇష్టపడతారు పర్యావరణ సంరక్షణతో వినియోగదారులకు ఉత్తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ఎంపికలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉంది.
కొత్త డాష్ అనేది మా తాజా మరియు అత్యంత లాభదాయకమైన ఆఫరింగ్, ఇది శైలి, వాస్తవికత, శక్తివంతమైన Li-అయాన్ బ్యాటరీతో పనితీరును పోర్టబుల్ మరియు విశ్వసనీయమైన, స్కూటర్గా ప్రజలకు అందిస్తున్నాము.
ఎల్లప్పుడూ, మేం కొత్త మరియు మెరుగైన ఉత్పత్తులను తీసుకొస్తూనే ఉంటాం మరియు కస్టమర్ ఫీడ్ బ్యాక్ ని ఎల్లప్పుడూ వింటూ ఉంటాం." దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీ డీలర్ షిప్ ల్లో హీరో డ్యాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెంటనే లభ్యం అవుతుంది.
Most Read:భారత దేశంలోని రాష్ట్ర పోలీస్ ఫోర్స్ ఉపయోగించే ఆధునిక కార్లు ఇవే
ఈ సంస్థ ప్రస్తుతం భారత మార్కెట్లో సుమారుగా 615 టచ్ పాయింట్లను కలిగి ఉంది, వీటిని 2020 చివరినాటికి 1000 కు విస్తరించాలని యోచిస్తోంది. ఈ కొత్త హీరో డాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 62,000 ఎక్స్-షోరూమ్ (ఇండియా) గా ఉంది.
Most Read:బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా
డీలర్ విస్తరణ ప్రణాళికలే కాకుండా, హీరో ఎలక్ట్రిక్ కూడా తన ప్లాంట్ వద్ద ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 5 లక్షల యూనిట్లకు పెంచుతూ, పెట్టుబడి పెట్టనుంది. డాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలతో పాటు, హీరో ఎలక్ట్రిక్ తన ' ఈఆర్ ' శ్రేణి వాహనాలను కూడా ప్రదర్శించారు.
Most Read:దారుణంగా మోసపోయాం... జావా కంపెనీపై మండిపడుతున్న కస్టమర్లు
ఇందులో ఇటీవల లాంచ్ అయిన ఆప్టిమా ఈఆర్ మరియు ఎన్వైఎక్స్ ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లో విడుదల చేసారు. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈఆర్ మరియు ఎన్వైఎక్స్ ఈఆర్ భారతీయ మార్కెట్లో ప్రీమియం శ్రేణిలో భాగంగా ఉన్నాయి.
రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను గత వారం లాంచ్ చేయగా, ఆప్టిమా ఈఆర్ ధర రూ. 68,721, ఎన్వైఎక్స్ ఈఆర్ రూ. 69,754 ధర తో ఉన్నాయి. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఇండియా) గా ఉన్నాయి.
ఆప్టిమా ఈఆర్ మరియు ఎన్వైఎక్స్ ఈఆర్ తో కూడిన హీరో ఎలక్ట్రిక్ ప్రొడక్ట్ లైనప్ లో ఉన్న ' ఈఆర్ రేంజ్ ' ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకి ప్రత్యర్థి అవుతుంది. ఇందులో రాబోయే బెర్లింగ్ ఆరా, ఏథర్ 450 ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
కొత్త డాష్ సహా మొత్తం మూడు స్కూటర్లు లిథియం-అయాన్ బ్యాటరీల ద్వారా అందించబడేవి. వారిని ప్రభుత్వ ఫేమ్ II ప్రోత్సాహకాలకు అనుగుణంగా ఉన్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్ టి రేట్లను భారత్ లో 5 శాతానికి తగ్గించటం వల్ల ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా పోటీ ధర పలుకుతున్నాయి.