68 వేల ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: పెట్రోల్ అవసరం లేదు!
భారతదేశ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం హీరో ఎలక్ట్రిక్ విపణిలోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. అధునాతన ఆప్టిమా ఈఆర్ మరియు నిక్స్ ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు వరుసగా రూ. 68,721 మరియు 69,754 ఎక్స్-షోరూమ్(ఇండియా)గా నిర్ణయించారు.

హీరో ఎలక్ట్రిక్ సంస్థ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న సాధారణ ఆప్టిమా ఇ5 మరియు నిక్స్ ఇ5 మోడళ్లకు కొనసాగింపు ఆప్టిమా ఈఆర్ మరియు నిక్స్ ఈఆర్ స్కూటర్లను విపణిలోకి తీసుకొచ్చింది. ఈ రెండు కూడా కంపెనీ యొక్క "హైస్పీడ్ సిరీస్ స్కూటర్ల" రేంజ్లో లభ్యమవుతాయి.

సాధారణ స్కూటర్లలో ఉన్నటువంటి అవే ఎలక్ట్రిక్ మోటార్ వ్యవస్థలే (ఎలక్ట్రిక్ ఇంజన్) ఈ రెండు మోడళ్లలో ఉన్నాయి. అయితే, సిగంల్ బ్యాటరీకి బదులుగా ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈఆర్ స్కూటర్లో 48వోల్ట్ సింగల్ బ్యాటరీ ప్యాక్ అనుసంధానం గల 600వాట్స్ బిఎల్డిసి ఎలక్ట్రిక్ మోటార్ కలదు. ఈ నూతన స్కూటర్లో అన్ని సాధారణ ఫీచర్లు లభిస్తున్నాయి. 4.5 గంటల ఛార్జింగ్తో గరిష్టంగా 100కిలోమీటర్ల నడుస్తుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 40కిమీలుగా ఉంది.

హీరో నిక్స్ ఈఆర్ స్కూటర్ విషయానికి వస్తే ఇందులో కూడా అదే 48వోల్ట్ బ్యాటరీ ప్యాక్ మరియు 600వాట్ బీఎల్డిసి ఎలక్ట్రిక్ మోటార్ సిస్టమ్ ఉంది. పర్ఫామెన్స్, టాప్ స్పీడ్ మైలేజ్ మరియు గరిష్ట వేగం అన్ని కూడా అచ్చం ఆప్టిమా ఈఆర్ స్కూటర్ మాదిరిగానే ఉన్నాయి.

హీరో ఎలక్ట్రిక్ సంస్థ విపణిలోకి రెండు సరికొత్త స్కూటర్ల విడుదలతో పాటు, బెంగళూరు నగరంలో సరికొత్త కార్పోరేట్ ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న 615 విక్రయ కేంద్రాలను 2020 నాటికి 1000 కేంద్రాలకు విస్తరించాలని భావిస్తోంది.హీరో ఎలక్ట్రిక్ సంస్థ ఇండియన్ కస్టమర్లకు ఎంచుకోదగిన ఆప్షన్లను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఇది వరకే లభించే మోడళ్లకు జతగా మరో రెండు మోడళ్లను ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం ఉన్న 615 విక్రయ కేంద్రాలను 2020 నాటికి 1000 కేంద్రాలకు విస్తరించాలని భావిస్తోంది. హీరో ఎలక్ట్రిక్ సంస్థ ఇండియన్ కస్టమర్లకు ఎంచుకోదగిన ఆప్షన్లను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఇది వరకే లభించే మోడళ్లకు జతగా మరో రెండు మోడళ్లను ప్రవేశపెట్టింది.

దీంతో కస్టమర్లు డిజైన్, ధర, మైలేజ్ మరియు పలు టెక్నికల్ ఫీచర్ల ఆధారంగా నచ్చిన మోడల్ ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు స్కూటర్లు కూడా విపణిలో లభించే ఏవన్ ట్రెండ్ ఇ, ఒకినవ ప్రైజ్ మరియు ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లకు సరాసరి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








