Just In
- 1 hr ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 3 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 11 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 18 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
కెటిఎమ్ - బజాజ్ కలయికలో వస్తున్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైక్...!
బజాజ్ భారత మార్కెట్లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ప్రారంభించనుంది. రాబోయే కాలంలో కొత్త అర్బనిట్ స్కూటర్ శ్రేణి భారతీయ మార్కెట్లో ప్రారంభించబడతాయి ఇది ఈ బ్రాండ్ నుండి వచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం అవుతుంది.
ఈ అర్బనిట్ స్కూటర్ శ్రేణిని , సామూహిక విఫణి మరియు ఎంట్రీ-లెవల్ డిమాండ్లకు అనుసంధానిస్తుంది. బజాజ్-కెటిఎమ్ లు కలిసి మరింత శక్తివంతమైన ఉత్పత్తుల కోసం కొత్త పవర్ ట్రైన్లను అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తోంది.
బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ, రాబోయే ఉత్పత్తుల యొక్క నమూనాలను కూడా అభివృద్ధి చేస్తున్నారని ధృవీకరించారు.
బజాజ్ మరియు కెటిఎం సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేదికను అభివృద్ధి చేస్తాయని తెలిసింది. రాబోయే ప్లాట్ 48-వోల్ట్ పవర్ట్రెయిన్కు మద్దతు ఇస్తుంది మరియు ఇది వివిధ మార్గాల్లో రెండు బ్రాండ్లుకు ఉపయోగించబడే ఒక సాధారణ ప్లాట్ఫారమ్గా ఉంటుంది.
కొత్త ప్లాట్ఫారమ్ ప్రోటోటైప్ దశలో ఉంది కానీ ఈ ప్లాట్ఫారమ్లోని మొదటి ఉత్పత్తి 2022 నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నందున అభివృద్ధి వేగంగా జరుగుతోంది.
కొత్త 48-వోల్ట్ పవర్ట్రెయిన్ 3 నుండి 10 kW వరకు అవుట్పుట్తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల యొక్క వివిధ శ్రేణులను నియంత్రిస్తుంది. అంతేకాదు, కొత్త ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.
Most Read: జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!
కెటిఎమ్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లలో విద్యుత్ ఆధారిత ద్విచక్ర వాహనాల పరిధిని అందిస్తుంది. కొత్త ప్లాట్ఫాం కెటిఎమ్ నుండి ఇన్పుట్లతో అభివృద్ధి చేయబడింది. ఈ నూతన వేదికపై అభివృద్ధి చేయబోయే ద్విచక్ర వాహనాలు ఇంకా తెలియవు.
Most Read: 150సిసి ద్విచక్ర వాహనాలను నిషేధించనున్న భారత ప్రభుత్వం...!
వీరి తయారీ నుంచి వచ్చిన,బజాజ్ డొమినార్ 400 మరియు కెటిఎమ్ 390 డ్యూక్ వంటి విజయవంతమైన ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి.
Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]
రాబోయే సంవత్సరాల్లో, ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో ఎక్కువ ఆదరణ ఉన్నందువలన , భారతీయ విఫణిలో కొన్ని ఉత్సాహకరమైన ఉత్పత్తులను చేయడాన్ని ఆశించవచ్చు.
రానున్న సంవత్సరాల్లో, భారతీయ విఫణిలో ఎలక్ట్రిక్-శక్తితో కూడిన చిన్న ద్విచక్ర వాహనాలు మరియు మూడు చక్రాల వాహనాల అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం అనుమతించగలదు. కొత్త ప్లాట్ఫాం భవిష్యత్తులో బ్రాండ్కు సహాయపడుతుంది.
అయితే, సాధారణ వాహనాలతో పోల్చితే విద్యుత్ ద్విచక్ర వాహనాల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది మరియు భారత మార్కెట్లో EV లను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
Source: E-Scoot