Just In
- 7 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 8 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 11 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 12 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చెప్పులేసుకుని బండి నడిపితే వెయ్యి, లుంగీ కడితే 2 వేలు ఫైన్.. జైలు కూడా!!
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై జరిమానాలు భారీ మొత్తంలో పెంచిన సంగతి తెలిసిందే. అయితే భారీ జరిమానాలు విధిస్తున్న కేసులు అధికమవ్వడంతో మోటారు వాహనాల చట్టం ప్రకారం ఎప్పటి నుండో రూల్స్ను తూ.చ. తప్పకుండా పోలీసులు అమలు చేస్తున్నారు. అందులో బండినడిపేటప్పుడు చెప్పులు, శాండిల్స్ వేసుకోవడం మరియు లారీ నడిపేటప్పుడు లుంగీ కట్టుకోవడం ఇలా చట్టంలో ఉండి ఇప్పటి వరకు సరిగ్గా అమలు కాని రూల్స్ను అమలు చేస్తున్నారు.
అవును, మీరు చదివింది నిజమే.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలు ఇంకా అమలు చేయకున్నా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చెప్పులు వేసుకుని వాహనం నడిపినా ఇక నుండి చలానా విధిస్తారని తెలుస్తోంది. అయితే ఈ రూల్ ఎప్పటి నుండో ఉన్నా ఈ చట్టంతో పాటు అమలు చేస్తారనే మాట వినిపిస్తోంది. ఈ రూల్ ప్రకారం చెప్పులు లేదా శాండిల్స్ లాంటివి ధరించి వాహనాలను నడపడం నేరంగా పేర్కొంటున్నారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా విధిస్తారు.
రెండో సారి కూడా అలాగే చెప్పులు వేసుకుని బైక్ నడిపితే 15 రోజుల పాటు జైలుశిక్షకి కూడా అవకాశం ఉందని అంటున్నారు. ఇక లారీ డ్రైవర్లు లుంగీ కట్టుకుని డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
నిజానికి 1989 నాటి మోటారు వాహనాల చట్టం కింద లారీలే కాక బస్సులు, వ్యాన్లు, ఇతర పెద్ద వాహనాలను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా ఫుల్ సైజు ప్యాంటు, షర్టు ధరించి, షూ కూడా వేసుకోవాలి. దీన్ని ఉల్లంఘిస్తే పాత చట్టం కింద రూ. 500 జరిమానా విధించేవారు.
Most Read: ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి
అన్ని జరిమానాలను భారీగా పెంచేసిన కొత్త చట్టం దీన్ని కూడా రూ. 2000 లకు పెంచింది. ఈ నియమాలన్నీ వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని అధికారులు చెబుతున్నారు. ప్రజలు పద్దతిగా రహదారి నియమాలను మరియు ట్రాఫిక్ చట్టాన్ని పాటిస్తే జరిమానాలకు భయపడాల్సిన అవసరంలేదని అధికారులు అంటున్నారు.