Just In
- 1 hr ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 16 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 17 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 19 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్
యమహా మోటార్స్ ఇండియా నవంబర్ 2019 నాటికి బిఎస్-6 మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇటీవల బిఎస్-6 మోడల్స్ రాకను ధృవీకరిస్తూ ఒక ప్రకటన చేసింది, ఏప్రిల్ 2020 ఉద్గార నిబంధనల గడువు కంటే ముందుగా వారి అన్ని టూ వీలర్స్ అప్డేట్ చేయనుంది, వివరాలలోకి వెళితే..
యమహా సంస్థ ముందుగానే ప్రకటించిన దాని ప్రకారం నవంబర్ 2019 నాటికి భారత మార్కెట్లో బిఎస్-6 మోటార్ సైకిల్స్ ను కంపెనీ ప్రవేశపెట్టనుండగా, స్కూటర్ల పై బిఎస్-6 వెర్షన్లు జనవరి 2020 నుంచి అమ్మకానికి వెళుతుందని తెలిపింది.
యమహా మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్ల యొక్క బిఎస్-6 వేరియంట్ల యొక్క ఉత్పత్తి వ్యయంలో పెంపుదల కూడా మార్కెట్లో ఉత్పత్తుల యొక్క తుది వ్యయంపై ప్రభావం చూపుతుందని చెప్పటానికి ఈ ప్రకటన చేసింది.
ఈ ధరల పెరుగుదల మోడల్ మరియు వేరియంట్ ను బట్టి 12-15 శాతం మధ్య ఉంటుందని తెలిపింది. యమహా ' సైడ్ స్టాండ్ స్విచ్ ' అనే కొత్త ఫీచర్ ను ఎంపిక చేసిన వేరియెంట్ లపై స్టాండర్డ్ గా ఈ ఫీచర్ ను పెట్టనుంది.
ఈ అదనపు సేఫ్టీ ఫీచర్ ఏమిటంటే సైడ్ స్టాండ్ పూర్తిగా విత్ డ్రా అయ్యేంత వరకు ఇంజిన్ స్టార్ట్ కాకుండా నిరోధిస్తుంది. అయితే, యమహా ఇంకా ఏ మోడళ్లలో అప్డేటెడ్ బిఎస్-6 స్పెక్ ఇంజన్లను అందుకోనుందో ముందుగా ప్రకటించనుంది.
యమహా మోటార్స్ ఇండియా మార్కెట్లో పలు ఉత్పత్తులను విడుదల చేస్తూ 2019 లో కొంత మార్కెట్ను దక్కించుకుంది. ఇది కొత్త ఎఫ్జెడ్ఎస్ వి 3.0 మరియు ఎంటి-15 తో పాటు వారి ప్రముఖ ఆర్15 వి 3.0, ఎఫ్జెడ్ 25 మరియు ఫజర్ 25 లు ఏబిఎస్ వెర్షన్లతో పాటు మార్కెట్ లో ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది.
Most Read: ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు
ఈ సంస్థ ఇటీవలే ఆర్15, ఎఫ్జడ్25, రే-జడ్ స్కూటర్ కు చెందిన ' మాన్స్టర్ ఎడిషన్ ' వేరియంట్లను కూడా ప్రవేశపెట్టింది. యమహా కాకుండా హీరో మోటోకార్ప్ ఇప్పటికే దేశీయంగా తొలి బిఎస్-6 ప్రామాణిక ద్విచక్ర వాహనాన్ని స్ప్లెండర్ ఐస్మార్ట్ కమ్యూటర్ మోటార్ సైకిల్ రూపంలో ఇప్పటికే విడుదల చేసింది.
Most Read: రైల్వే ట్రాక్ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!
హోండా ఈ ఏడాది చివరికల్లా భారత మార్కెట్లో కొంతమేర అమ్మకానికి వెళ్లాల్సి ఉందని, యాక్టివా 125 కు చెందిన బిఎస్-6 వర్షన్ ను కూడా ఒక షో లో ఇప్పటికే ప్రదర్శించారు.
Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!
ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న మోడళ్లలో చాలా వరకు బిఎస్-6 వర్షన్ ను త్వరలోనే అనుసరించనుంది. ఈ జపనీస్ బ్రాండ్ నుంచి అమ్మకానికి వెళ్లాల్సిన మొదటి బిఎస్-6 ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నాయి.