కొత్త బ్యాటరీ టెక్నాలజీతో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను వెల్లడించిన యమహా !
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించడంతో యమహా మోటార్ కార్పొరేషన్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన కార్యకలాపాలను ఆరంభించనుంది. జపనీస్ టూ వీలర్ మేకర్ నుండి మొదటి జీరో-పైబర్ వాహనం గోగోరో యొక్క బ్యాటరీ స్వైపింగ్ టెక్నాలజీతో రానుంది.

జపనీస్ కంపెనీ ఇటీవల తన బ్యాటరీ స్వైపింగ్ టెక్నాలజీని తయారు చేసింది, ఇది జపనీస్ మోటార్ సైకిల్ మేకర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో ఈ ఫీచర్ ఉంటుంది.

ఈసి-05 అని పిలిచే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను యమహా, కవాసకి, సుజుకి మరియు హోండా వారు తమ మొట్టమొదటి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను స్వైపింగ్ బ్యాటరీ టెక్నాలజీతో త్వోరగా సిద్ధం చేయడానికి చేతులు కలిపారు.

జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా, పవర్ యూనిట్లను పరస్పరం సులభంగా మార్చడంలో తోడ్పడే బ్యాటరీ టెక్నాలజీతో ముందుకు రావడం కోసం తైవానీస్ కంపెనీ గోగోరో తో భాగస్వామిగా ప్రకటించింది.

ఈ రెండు కంపెనీలకు సహకరించే విధంగా ఈ టెక్నాలజీని యమహా ఈసి-05 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ ఫీచర్ ని తీసుకురానుంది. యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇంకా తెలియాల్సి ఉంది.యమహా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలు 80 కి.మీ నుండి 100 కి.మీ మధ్య పరిధిలో రానున్నాయని తెలిసింది.

దీని నుండి, యమహా ఈసి-05 అనేది డీసెంట్ ఇంటర్ సిటీ శ్రేణితో పాటు దీర్ఘ మరియు సమర్థవంతమైన ఇంట్రా సిటీ కమ్యూట్ లకు పరిపూర్ణ సేవలందించనున్నట్లు చాలా స్పష్టంగా ఉంది.ఈ ఏడాది ఆగస్టు నుంచి తైవానీస్ మార్కెట్ లో యమహా ఈసి-05 ను తొలుత విక్రయించనున్నారు.

ఈ కొత్త మోడల్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో కూడా అమ్ముడవనుంది, దీని అర్థం ఏమిటంటే, స్వైపింగ్ బ్యాటరీ సాంకేతికత ఇతర దేశాలలో ఉన్న స్కూటర్ తయారీదారులకు మంచి మార్గంని కలిగించనుంది.

అయితే, భారత్ లో కొత్తగా యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయడంపై ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.

అయితే, మనకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే జపాన్ ఆటో దిగ్గజం తన ఈవి టెక్నాలజీపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనుంది, అయితే భవిష్యత్తులో భారత్ లో కూడా ఈ ఆధునిక శ్రేణి స్కూటర్లను ప్రారంభించవచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications








