Just In
- 38 min ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 16 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
Don't Miss
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గుడ్ న్యూస్....ఇప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టనున్న ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్!
2020 లో ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను 6 కొత్త నగరాలలో విడుదలచేయనుంది. ఈ ఆరు నగరాలలో కూడా మొదట హైదరాబాద్ లో విడుదలచేయడానికి అన్ని సన్నాహాలు జరుపుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!
బెంగళూరు మరియు చెన్నైలలో విజయవంతంగా ప్రారంభించిన తరువాత, హీరో మోటోకార్ప్ మద్దతు ఉన్న ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను 2020 లో భారతదేశంలోని 6 కొత్త నగరాల్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో మొదటిది హైదరాబాద్.
ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రొఫైల్ ఫోటోను సోషల్ మీడియాలో అప్డేట్ చేసింది. ఎథర్ సంస్థ దీని గురించి మరింత సమాచారం తెలుగులో రాయడానికి ప్రధాన కారణం ఏమిటంటే దీనిని మొదట హైదరాబాద్ లో విడుదల చేయాలని అనుకున్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మాట్లాడే భాష తెలుగు కాబట్టి దీని గురించి తెలుగులో రాయడం జరిగింది.
ఎథర్ యొక్క అధికారిక గమ్యస్థానాలు పూణే,ముంబై,ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ లో ఉన్నాయి అని గతంలో వెల్లడించింది.
ఎథర్ మొట్టమొదట 2017లో బెంగళూరులో ప్రారంభించింది. కానీ డెలివరీలు 2018లో ప్రారంభమయ్యాయి. ఇంక 2019 లో కంపెనీ తమ నెట్వర్క్ ని చెన్నైకి విస్తరించింది. 2020 కి తమ విస్తరణ ఇంకా ఎక్కువగా ఉండాలి అని ప్లాన్లు వేస్తుంది. 2020 లో తమ ఉత్పత్తిని మార్కెట్లో రంగప్రవేశం చేయించనుంది. ఇదే తరుణంలో బజాజ్ చేతక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. చేతక్ తమ వెహికల్ ని విడుదల చేస్తుంది, కావున ఎథర్ కొంత పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది.
ఎథర్ ప్రయోగ సమయంలో రెండు స్కూటర్లను ప్రారంభించింది. అవి ఒకటి ఎస్ 340 మరియు ఎస్ 450. తరువాత వీటిని 340 మరియు 450 గా మార్చారు. గత సంవత్సరం 340 నిలిపివేయబడింది. ఎందుకంటే 450 ఇ-స్కూటర్ కోసం 90% కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈథర్ 450 మాత్రమే బెంగళూరు మరియు చెన్నైలలో అమ్మకానికి ఉంది. కాబట్టి ఎథర్ 340 కి ఎక్కువ డిమాండ్ లేనందువల్ల వీటిని నిలిపివేయడం జరిగింది.
ఎథర్ 450 ధర రూ.1.25 లక్షలు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేట్లు తగ్గడంతో వీటి ధర ఇప్పుడు రూ. 1.12 లక్షలుగా ఉంది. ఎథర్ 450 కి బెంగళూరు మరియు చెన్నై రెండింటిలోనూ మంచి ఆదరణ లభించింది. ఇది సింగిల్ వైట్ పెయింట్ స్కీమ్లో లభిస్తుంది, ఫ్రంట్ ఆప్రాన్లో బ్లాక్ టచ్ ఉంది మరియు వీటిలో ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. వీటిలో టిఎఫ్టి కలర్ డిస్ప్లే, ముందు మరియు వెనుక వైపున ఎల్ఇడి లైటింగ్ మరియు ఓవర్-ది -అయిర్ సాఫ్ట్వేర్ మరియు ఫర్మ్వేర్ నవీకరణలు చేయబడ్డాయి.
ఇది బ్లూటూత్, వెహికల్ ట్రాకింగ్ మరియు వెహికల్ డయాగ్నస్టిక్లను అంతర్నిర్మిత రివర్స్ పార్క్ అసిస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ లక్షణం పార్కింగ్ను సులభతరం చేయడానికి మరియు పార్కింగ్ స్థలాల నుండి బయటికి వెళ్లడానికి స్కూటర్ను రివర్స్ దిశలో లాగడానికి రైడర్కు అనుకూలంగా ఉంటుంది.
Read More:టయోటా నుంచి బుకింగ్ కి సిద్దమవుతున్న మరో రెండు కార్లు!
ఎథర్ 450 బ్రష్లెస్ డిసి మోటర్ (బిఎల్డిసి) కు అనుసంధానించబడిన 2.4 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది. బ్యాటరీ ఎకో మోడ్లో 60 కిలోమీటర్లు, రెగ్యులర్ మోడ్లో 50 కిలోమీటర్లను 80 కిలోమీటర్ల వేగంతో మరియు 3.9 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగంతో అందిస్తుంది. బ్యాటరీలు 3 సంవత్సరాల అపరిమిత కిమీ వారంటీతో వస్తాయి.
Read More:ఈ వోక్స్వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?
ఎథర్ ఎనర్జీ బెంగళూరు మరియు చెన్నైలలో ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థలలో కూడా పెట్టుబడులు పెడుతోంది. నేటికీ చెన్నైలో 10 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంకా కొన్ని ఛార్జింగ్ పాయింట్లను తయారుచేయనుంది. అయితే 2019 డిసెంబర్ వరకు ఈథర్ 450 యజమానులకు ఉచిత ఛార్జింగ్ ఇవ్వబడింది.
Read More:2020 ఇండియన్ ఆటో ఎక్స్పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!