కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

ఇండియన్ మార్కెట్లో బజాజ్ ఆటో ప్రముఖ వాహన తయారీ సంస్థలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. బజాజ్ కంపెనీ ద్విచక్ర వాహనాలను మరియు త్రీ వీలర్స్ తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తుంది. ఇప్పుడు ప్రీమియం బైక్‌ల తయారీకి బజాజ్ ఆటో మహారాష్ట్రలో కొత్త ద్విచక్ర వాహనాల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. దీని గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

బజాజ్ ఆటో వాహనాలకు ఒక్క దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. బజాజ్ ఆటో ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలోని చకాన్ లో ద్విచక్ర వాహన తయారీ ప్లాంట్ కలిగి ఉంది.

కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

బజాజ్ ఆటో సంస్థ కింద కెటిఎమ్, హస్క్ వర్ణ వంటి ప్రీమియం బైక్‌లను కూడా ఈ యూనిట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్‌లో ఉత్పత్తి చేసే బైక్‌లను భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఉపయోగిస్తున్నారు. బజాజ్ ఆటో తన తయారీ కర్మాగారంలో ప్రీమియం బైక్‌ల ఉత్పత్తి కోసం ఇంగ్లాండ్‌కు చెందిన ట్రయంఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది.

కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

చకన్ లోని బజాజ్ ప్రొడక్షన్ ప్లాంట్ బజాజ్-ట్రయంఫ్ బైకులను ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక చేయబడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఉత్పత్తి చేసే అన్ని బైక్‌ల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని బజాజ్ ఆటో కొత్త ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

650 కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త ద్విచక్ర వాహన తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని బజాజ్ ఆటో నిర్ణయించింది. ఈ కొత్త తయారీ కర్మాగారంలో 2023 కల్లా వాహనాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ కెటిఎమ్, హస్క్ వెర్నా మరియు ట్రయంఫ్ ప్రీమియం బైక్‌లను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

బజాజ్ ఆటో కూడా ఈ యూనిట్‌లో సొంతంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేయాలని నిర్ణయించింది. బజాజ్ ఆటో తన అత్యంత ప్రాచుర్యం పొందిన అనేక బైకుల ధరలను పునరుద్ధరించింది. వీటిలో ప్లాటినం సిరీస్ యొక్క 100 మరియు 110 నమూనాలు ఉన్నాయి. ప్లాటినా 100 భారత మార్కెట్లో అత్యధిక మైలేజ్ అందించే బైకులలో ఒకటి.

కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

ఈ బైక్‌లో ఎక్కువ మైలేజ్ మరియు పనితీరును పొందడానికి బజాజ్ ఆటో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను అమలు చేసింది. బజాజ్ తన పల్సర్ బైక్ యొక్క అన్ని మోడళ్ల ధరను రూ. 1000 నుంచి 1500 రూపాయల వరకు పెంచనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఇటీవల విడుదల చేసిన పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ ధరను కూడా పెంచారు.

కొత్త ప్రొడక్షన్ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టిన బజాజ్ ఆటో : వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

బజాజ్ ఆటో దేశీయ మరియు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేసే పనిలో ఉంది. కొత్త ఉత్పత్తి కర్మాగారంలో అనేక హై-ఎండ్ సమర్పణలతో సహా కొత్త మోటార్‌సైకిళ్ల శ్రేణిని పరిచయం చేస్తుందని మేము భావిస్తున్నాము. ఈ కొత్త బ్రాండ్ల వల్ల మరింత ఎక్కువ అమ్మకాలు జరిగే అవకాసమ్ ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 23, 2020, 18:32 [IST]
English summary
Bajaj Auto Company To Set Up New Manufacturing Unit. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+