Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 15 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంప్లాయిస్ 50% వేతనాన్ని తగ్గించిన బజాజ్ ఆటో, ఎందుకో తెలుసా !
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు బజాజ్ ఆటో యొక్క ఔరంగాబాద్ తయారీ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు గత నెలలో కరోనా వైరస్ సంక్రమణతో మరణించారు. అదనంగా ఒకే తయారీ కర్మాగారంలో 140 మంది కార్మికులకు వ్యాధి సోకినట్లు నిర్దారించబడింది.
ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో ఔరంగాబాద్లోని వాలూజ్ తయారీ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో, తమ ఔరంగాబాద్ తయారీ కర్మాగారంలో పనిచేసే కార్మికుల యొక్క వేతనాలను 50% తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కార్మికుల ఇన్ఫెక్షన్ నేపథ్యంలో తయారీ కర్మాగారాన్ని మూసివేయాలని ఉద్యోగ సంఘాలు సంస్థను కోరాయి.
అంతే కాకుండా బజాజ్ ఆటో కంపెనీ ఔరంగాబాద్లో కరోనా కేసుల సంఖ్యను తగ్గించడానికి స్థానిక పరిపాలన జూలై 10 నుండి జూలై 18 వరకు ఔరంగాబాద్లో పూర్తి లాక్-డౌన్ అమలు చేయబడింది.
MOST READ:భారతదేశంలో అతి తక్కువ ధర కల్గిన టాప్ 5 సిఎన్జి కార్లు
లాక్ డౌన్ కి సంబంధించి స్థానిక పరిపాలన నుండి కంపెనీకి ఇంకా నోటిఫికేషన్ రాలేదని బజాజ్ కంపెనీ వారు తెలిపారు. జూలై 8 మరియు 9 తేదీలలో మరియు లాక్ డౌన్ తర్వాత మొదటి రోజు కంపెనీకి వచ్చిన ఉద్యోగులకు మాత్రమే వేతనంలో 50% లభిస్తుందని కంపెనీ తెలిపింది.
దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, బజాజ్ ఆటో యొక్క డివిజనల్ మేనేజర్ అనిల్ మోహితే ఇప్పటికే ఔరంగాబాద్ యూనిట్లోని కార్మికులకు వేతనాన్ని సగానికి తగ్గించడం గురించి నోటీసు కూడా జారీ చేశారు. స్థానిక పరిపాలన లాక్ డౌన్ ప్రకటించి యూనిట్ ని మూసివేస్తే ఉద్యోగులకు 50% వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.
MOST READ:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే
బజాజ్ ఆటో యొక్క ట్రేడ్ యూనియన్ ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు 403 మంది ఉద్యోగులు కరోనావైరస్ బారిన పడ్డారు మరియు 7 మంది ఉద్యోగులు మరణించారు తెలిసింది.
కరోనా బాధితులకు చికిత్స మరియు సంరక్షణ ఖర్చులను కంపెనీ భరించాలని ఎంప్లాయీస్ యూనియన్ సంస్థ మేనేజ్మెంట్ కి లేఖ రాసింది. అంతే కాకుండా తయారీ కర్మాగారం సమీపంలో కోవిడ్ -19 కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది.
MOST READ:వికాస్ దూబే ఎన్ కౌంటర్ తర్వాత మహీంద్రా కార్స్ భద్రతపై డౌట్స్, ఎందుకో మీరే చూడండి ?