Just In
- 1 hr ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 3 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 6 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- Movies లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ దివి... ఓన్లీ మగవారి కోసమే అంటూ!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఎంప్లాయిస్ 50% వేతనాన్ని తగ్గించిన బజాజ్ ఆటో, ఎందుకో తెలుసా !
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు బజాజ్ ఆటో యొక్క ఔరంగాబాద్ తయారీ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు గత నెలలో కరోనా వైరస్ సంక్రమణతో మరణించారు. అదనంగా ఒకే తయారీ కర్మాగారంలో 140 మంది కార్మికులకు వ్యాధి సోకినట్లు నిర్దారించబడింది.
ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో ఔరంగాబాద్లోని వాలూజ్ తయారీ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో, తమ ఔరంగాబాద్ తయారీ కర్మాగారంలో పనిచేసే కార్మికుల యొక్క వేతనాలను 50% తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కార్మికుల ఇన్ఫెక్షన్ నేపథ్యంలో తయారీ కర్మాగారాన్ని మూసివేయాలని ఉద్యోగ సంఘాలు సంస్థను కోరాయి.
అంతే కాకుండా బజాజ్ ఆటో కంపెనీ ఔరంగాబాద్లో కరోనా కేసుల సంఖ్యను తగ్గించడానికి స్థానిక పరిపాలన జూలై 10 నుండి జూలై 18 వరకు ఔరంగాబాద్లో పూర్తి లాక్-డౌన్ అమలు చేయబడింది.
MOST READ:భారతదేశంలో అతి తక్కువ ధర కల్గిన టాప్ 5 సిఎన్జి కార్లు
లాక్ డౌన్ కి సంబంధించి స్థానిక పరిపాలన నుండి కంపెనీకి ఇంకా నోటిఫికేషన్ రాలేదని బజాజ్ కంపెనీ వారు తెలిపారు. జూలై 8 మరియు 9 తేదీలలో మరియు లాక్ డౌన్ తర్వాత మొదటి రోజు కంపెనీకి వచ్చిన ఉద్యోగులకు మాత్రమే వేతనంలో 50% లభిస్తుందని కంపెనీ తెలిపింది.
దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, బజాజ్ ఆటో యొక్క డివిజనల్ మేనేజర్ అనిల్ మోహితే ఇప్పటికే ఔరంగాబాద్ యూనిట్లోని కార్మికులకు వేతనాన్ని సగానికి తగ్గించడం గురించి నోటీసు కూడా జారీ చేశారు. స్థానిక పరిపాలన లాక్ డౌన్ ప్రకటించి యూనిట్ ని మూసివేస్తే ఉద్యోగులకు 50% వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.
MOST READ:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే
బజాజ్ ఆటో యొక్క ట్రేడ్ యూనియన్ ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు 403 మంది ఉద్యోగులు కరోనావైరస్ బారిన పడ్డారు మరియు 7 మంది ఉద్యోగులు మరణించారు తెలిసింది.
కరోనా బాధితులకు చికిత్స మరియు సంరక్షణ ఖర్చులను కంపెనీ భరించాలని ఎంప్లాయీస్ యూనియన్ సంస్థ మేనేజ్మెంట్ కి లేఖ రాసింది. అంతే కాకుండా తయారీ కర్మాగారం సమీపంలో కోవిడ్ -19 కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది.
MOST READ:వికాస్ దూబే ఎన్ కౌంటర్ తర్వాత మహీంద్రా కార్స్ భద్రతపై డౌట్స్, ఎందుకో మీరే చూడండి ?