Just In
- 1 hr ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 5 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 7 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 10 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎంప్లాయిస్ 50% వేతనాన్ని తగ్గించిన బజాజ్ ఆటో, ఎందుకో తెలుసా !
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు బజాజ్ ఆటో యొక్క ఔరంగాబాద్ తయారీ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు గత నెలలో కరోనా వైరస్ సంక్రమణతో మరణించారు. అదనంగా ఒకే తయారీ కర్మాగారంలో 140 మంది కార్మికులకు వ్యాధి సోకినట్లు నిర్దారించబడింది.
ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో ఔరంగాబాద్లోని వాలూజ్ తయారీ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో, తమ ఔరంగాబాద్ తయారీ కర్మాగారంలో పనిచేసే కార్మికుల యొక్క వేతనాలను 50% తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కార్మికుల ఇన్ఫెక్షన్ నేపథ్యంలో తయారీ కర్మాగారాన్ని మూసివేయాలని ఉద్యోగ సంఘాలు సంస్థను కోరాయి.
అంతే కాకుండా బజాజ్ ఆటో కంపెనీ ఔరంగాబాద్లో కరోనా కేసుల సంఖ్యను తగ్గించడానికి స్థానిక పరిపాలన జూలై 10 నుండి జూలై 18 వరకు ఔరంగాబాద్లో పూర్తి లాక్-డౌన్ అమలు చేయబడింది.
MOST READ:భారతదేశంలో అతి తక్కువ ధర కల్గిన టాప్ 5 సిఎన్జి కార్లు
లాక్ డౌన్ కి సంబంధించి స్థానిక పరిపాలన నుండి కంపెనీకి ఇంకా నోటిఫికేషన్ రాలేదని బజాజ్ కంపెనీ వారు తెలిపారు. జూలై 8 మరియు 9 తేదీలలో మరియు లాక్ డౌన్ తర్వాత మొదటి రోజు కంపెనీకి వచ్చిన ఉద్యోగులకు మాత్రమే వేతనంలో 50% లభిస్తుందని కంపెనీ తెలిపింది.
దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, బజాజ్ ఆటో యొక్క డివిజనల్ మేనేజర్ అనిల్ మోహితే ఇప్పటికే ఔరంగాబాద్ యూనిట్లోని కార్మికులకు వేతనాన్ని సగానికి తగ్గించడం గురించి నోటీసు కూడా జారీ చేశారు. స్థానిక పరిపాలన లాక్ డౌన్ ప్రకటించి యూనిట్ ని మూసివేస్తే ఉద్యోగులకు 50% వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.
MOST READ:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే
బజాజ్ ఆటో యొక్క ట్రేడ్ యూనియన్ ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు 403 మంది ఉద్యోగులు కరోనావైరస్ బారిన పడ్డారు మరియు 7 మంది ఉద్యోగులు మరణించారు తెలిసింది.
కరోనా బాధితులకు చికిత్స మరియు సంరక్షణ ఖర్చులను కంపెనీ భరించాలని ఎంప్లాయీస్ యూనియన్ సంస్థ మేనేజ్మెంట్ కి లేఖ రాసింది. అంతే కాకుండా తయారీ కర్మాగారం సమీపంలో కోవిడ్ -19 కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది.
MOST READ:వికాస్ దూబే ఎన్ కౌంటర్ తర్వాత మహీంద్రా కార్స్ భద్రతపై డౌట్స్, ఎందుకో మీరే చూడండి ?