Just In
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 6 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ ; ధర & వివరాలు
భారత మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన బజాజ్ ఆటో బ్రాండ్ యొక్క మోటారుసైకిల్ బజాజ్ ప్లాటిన. ఇప్పడు బజాజ్ కంపెనీ తన ప్లాటినా 100 కిక్ స్టార్ట్ వేరియంట్ను కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో తీసుకువచ్చింది. కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ ప్లాటినా 100 (కిక్ స్టార్ట్) బైక్ ధర రూ. 51,667 (ఎక్స్-షోరూమ్).
బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ బైక్ రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి కాక్టెయిల్ వైన్ రెడ్ మరియు ఎబోనీ బ్లాక్ విత్ సిల్వర్ డెకాల్. ఈ బైక్ కొత్త నవీనీకరణలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అంతే కాకుండా ఇది వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా కూడా ఉటుంది.
స్ప్రింగ్ ఆన్ స్ప్రింగ్ నైట్రోక్స్ సస్పెన్షన్ ఇప్పుడు కొత్త ప్లాటినా 100 కిక్ స్టార్ట్లో అందించబడుతోంది. కొత్త సస్పెన్షన్తో రైడ్ ఇప్పుడు 15 శాతం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సస్పెన్షన్ రోడ్లపై మరింత ప్రభావవంతంగా ఉంటుంది మరియు పాత సస్పెన్షన్ కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఇస్తుంది.
MOST READ:ఎక్స్యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్యూవీ, ఎలాగో చూసారా ?
ఈ బైక్లో సస్పెన్షన్ సైజును కూడా మునుపటికంటే 20 శాతం పెంచారు. ఈ కారణంగా కఠినమైన రోడ్లలో నడపడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బైక్ లో రోడ్డుపై పంక్చర్ నివారించడానికి, ట్యూబ్లెస్ టైర్లను అందిస్తున్నారు.
ప్లాటినా 100 కిక్ స్టార్ట్ కొత్త మోడల్ సీటును కలిగి ఉంది, ఇది మంచి పట్టును కలిగి ఉంది. ఇది బైక్ నడుపుతున్నప్పుడు డ్రైవర్ కి మరియు వెనుక కూర్చున్న వారికీ చాలా కంపర్ట్ గా ఉంటుంది.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?
ఈ కొత్త బైక్ లో బజాజ్ కొత్త ఫీచర్స్ అప్డేట్స్ చేసింది. కంపెనీ దీనికి ఎల్ఈడీ హెడ్లైట్ను జోడించింది. దీంతో ఎల్ఈడీ డీఆర్ఎల్ లైట్ను కూడా అందిస్తున్నారు. పాత హెడ్లైట్ కంటే ఎల్ఈడీ హెడ్లైట్ దృశ్యమానత ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది.
బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ పై మంచి పట్టు కోసం ప్రొటెక్టివ్ ట్యాంక్ ప్యాడ్లను అందిస్తున్నారు. దీనితో పాటు మిర్రర్స్ మరియు ఇండికేటర్స్ కూడా పునఃరూపకల్పన చేశారు. ఈ బైక్లో ఇప్పటికే మంచి గ్రిప్ కోసం రబ్బర్ ఫుట్ప్యాడ్లు ఉన్నాయి.
MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా
బజాజ్ కంపెనీ ఈ బైక్ గురించి మాట్లాడుతూ, బజాజ్ ప్లాటినా మోడల్ 15 సంవత్సరాలుగా అమ్మకానికి ఉంది, ఇప్పటివరకు ఈ బైక్ 72 లక్షలకు పైగా విక్రయించిందని పేర్కొంది. ఈ బైక్ను దేశీయ మార్కెట్లో చాలామంది వాహనదారులు ఇష్టపడుతున్నారు.
బజాజ్ 100 కిక్ స్టార్ట్ మోడల్ను అక్టోబర్లో రూ. 46,832 (ఎక్స్షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్ను కేవలం ఒక నెల సమయంలోనే మళ్ళీ అప్డేట్ చేసింది. బజాజ్ ప్లాటినా సరసమైన ధర వద్ద లభించే నాణ్యమైన మైలేజీని అందించే బైక్. కంపెనీ మొదట ప్లాటినాతో కంఫర్టెక్ టెక్నాలజీని ప్రారంభించింది.
బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో 1,88,196 యూనిట్ల వాహనాలను విక్రయించినాట్లు నివేదిక ద్వారా తెలిసింది. గత నెలలో ఇది దాదాపు 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే నవంబర్ నెలలో కంపెనీ 1,76,337 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
బజాజ్ వాణిజ్య వాహన అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 38 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహన, వాణిజ్య వాహనాలతో సహా కంపెనీ మొత్తం 4,22,240 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కరోనా లాక్ డౌన్ తర్వాత కంపెనీ అమ్మకాల పరంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇపుడు ఈ కొత్త బైక్ లాంచ్ చేయడం వల్ల ద్విచక్ర వాహన విభాగంలో మంచి అమ్మకను సాధిస్తుంది భావించవచ్చు.
MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్లోనే వెళ్తారు