Just In
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 5 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 7 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 15 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బజాజ్-ట్రయంప్ నుండి రానున్న 200 సిసి బైక్స్ ధర 2 లక్షల్లోపే
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ ఆటో ఒకటి. ఇప్పుడు బజాజ్ ఆటో - ట్రయంఫ్ నుండి మార్కెట్లోకి కొత్త బైకులు ప్రవేశపెట్టనుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!
బజాజ్ ఆటో మిడ్-రేంజ్ బైక్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ట్రయంఫ్ ప్రీమియం బైక్ యుకెతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కూటమిలో తొలిసారిగా కొత్త బైక్ మోడళ్ల ప్రకటన గురించి ఈ రోజు పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించబడింది.
ఈ కార్యక్రమంలో ట్రయంఫ్ మోటార్సైకిల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ స్ట్రౌడ్ మాట్లాడుతూ, బజాజ్ ట్రయంఫ్స్ను భారతదేశంలో మరియు కొన్ని ఇతర మార్కెట్లలో పంపిణీ చేయనున్నట్లు ధృవీకరించారు.
ఈ భాగస్వామ్యంలో మీడియం వెయిట్ విభాగంతో ప్రీమియం బైక్ మోడళ్లను రూపొందించడానికి ట్రయంఫ్ బ్రాండ్ సిద్ధంగా ఉంది. ఏ విధంగా అంటే టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ కూటమి మాదిరిగా, ఈ కూటమి కూడా మిడిల్ వెయిట్ సెగ్మెంట్ ను లక్ష్యంగా చేసుకుంటోంది.
బజాజ్-ట్రయంఫ్ నుండి వచ్చే ఈ బైక్స్ 2 లక్షల రూపాయలకంటే తక్కువ ధరను కలిగి ఉండవచ్చు. ఈ మోటార్ సైకిల్స్ 2022 కి షో రూంలకి వచ్చే అవకాశం ఉంది. వీటి గురించి మరింత సమాచారం కొన్ని రోజులలోనే విడుదల చేయనుంది.
అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్స్ కోసం కొత్త ఇంజిన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి 200 సిసి నుండి 750 సిసి వరకు సామర్థ్యం గల ఇంజన్లతో రానున్నాయి.
మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహన్ లోని బజాజ్ ఆటో ప్లాంట్లో ఈ కొత్త బైక్ మోడల్స్ తయారు చేయబడతాయి. ఇక్కడ తయారు చేసే బైకులు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్లను భారతదేశంలో బజాజ్ ఆటో డీలర్ల ద్వారా విక్రయించనున్నారు.
కొత్త నవీనీకరణలతో రాబోతున్న బజాజ్-ట్రయంప్ మోటార్ సైకిల్స్ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే కెటిఎమ్ డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి వాహనాలను ప్రత్యర్థిగా ఉండవలసి ఉంటుంది. బజాజ్-ట్రయంప్ 200 సిసి బైక్స్ కోసం ఇంకా కొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుంది.