Just In
- 1 hr ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 3 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 5 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- Movies లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ దివి... ఓన్లీ మగవారి కోసమే అంటూ!
- News సీఎం జగన్ వద్దకు భూమా అఖిల ప్రియ.. తరువాత ఏం జరిగిందంటే..!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బజాజ్-ట్రయంప్ నుండి రానున్న 200 సిసి బైక్స్ ధర 2 లక్షల్లోపే
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ ఆటో ఒకటి. ఇప్పుడు బజాజ్ ఆటో - ట్రయంఫ్ నుండి మార్కెట్లోకి కొత్త బైకులు ప్రవేశపెట్టనుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!
బజాజ్ ఆటో మిడ్-రేంజ్ బైక్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ట్రయంఫ్ ప్రీమియం బైక్ యుకెతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కూటమిలో తొలిసారిగా కొత్త బైక్ మోడళ్ల ప్రకటన గురించి ఈ రోజు పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించబడింది.
ఈ కార్యక్రమంలో ట్రయంఫ్ మోటార్సైకిల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ స్ట్రౌడ్ మాట్లాడుతూ, బజాజ్ ట్రయంఫ్స్ను భారతదేశంలో మరియు కొన్ని ఇతర మార్కెట్లలో పంపిణీ చేయనున్నట్లు ధృవీకరించారు.
ఈ భాగస్వామ్యంలో మీడియం వెయిట్ విభాగంతో ప్రీమియం బైక్ మోడళ్లను రూపొందించడానికి ట్రయంఫ్ బ్రాండ్ సిద్ధంగా ఉంది. ఏ విధంగా అంటే టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ కూటమి మాదిరిగా, ఈ కూటమి కూడా మిడిల్ వెయిట్ సెగ్మెంట్ ను లక్ష్యంగా చేసుకుంటోంది.
బజాజ్-ట్రయంఫ్ నుండి వచ్చే ఈ బైక్స్ 2 లక్షల రూపాయలకంటే తక్కువ ధరను కలిగి ఉండవచ్చు. ఈ మోటార్ సైకిల్స్ 2022 కి షో రూంలకి వచ్చే అవకాశం ఉంది. వీటి గురించి మరింత సమాచారం కొన్ని రోజులలోనే విడుదల చేయనుంది.
అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్స్ కోసం కొత్త ఇంజిన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి 200 సిసి నుండి 750 సిసి వరకు సామర్థ్యం గల ఇంజన్లతో రానున్నాయి.
మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహన్ లోని బజాజ్ ఆటో ప్లాంట్లో ఈ కొత్త బైక్ మోడల్స్ తయారు చేయబడతాయి. ఇక్కడ తయారు చేసే బైకులు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్లను భారతదేశంలో బజాజ్ ఆటో డీలర్ల ద్వారా విక్రయించనున్నారు.
కొత్త నవీనీకరణలతో రాబోతున్న బజాజ్-ట్రయంప్ మోటార్ సైకిల్స్ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే కెటిఎమ్ డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి వాహనాలను ప్రత్యర్థిగా ఉండవలసి ఉంటుంది. బజాజ్-ట్రయంప్ 200 సిసి బైక్స్ కోసం ఇంకా కొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుంది.