Just In
- 7 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 8 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 11 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 13 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బజాజ్-ట్రయంప్ నుండి రానున్న 200 సిసి బైక్స్ ధర 2 లక్షల్లోపే
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో బజాజ్ ఆటో ఒకటి. ఇప్పుడు బజాజ్ ఆటో - ట్రయంఫ్ నుండి మార్కెట్లోకి కొత్త బైకులు ప్రవేశపెట్టనుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!
బజాజ్ ఆటో మిడ్-రేంజ్ బైక్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ట్రయంఫ్ ప్రీమియం బైక్ యుకెతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కూటమిలో తొలిసారిగా కొత్త బైక్ మోడళ్ల ప్రకటన గురించి ఈ రోజు పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించబడింది.
ఈ కార్యక్రమంలో ట్రయంఫ్ మోటార్సైకిల్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ స్ట్రౌడ్ మాట్లాడుతూ, బజాజ్ ట్రయంఫ్స్ను భారతదేశంలో మరియు కొన్ని ఇతర మార్కెట్లలో పంపిణీ చేయనున్నట్లు ధృవీకరించారు.
ఈ భాగస్వామ్యంలో మీడియం వెయిట్ విభాగంతో ప్రీమియం బైక్ మోడళ్లను రూపొందించడానికి ట్రయంఫ్ బ్రాండ్ సిద్ధంగా ఉంది. ఏ విధంగా అంటే టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ కూటమి మాదిరిగా, ఈ కూటమి కూడా మిడిల్ వెయిట్ సెగ్మెంట్ ను లక్ష్యంగా చేసుకుంటోంది.
బజాజ్-ట్రయంఫ్ నుండి వచ్చే ఈ బైక్స్ 2 లక్షల రూపాయలకంటే తక్కువ ధరను కలిగి ఉండవచ్చు. ఈ మోటార్ సైకిల్స్ 2022 కి షో రూంలకి వచ్చే అవకాశం ఉంది. వీటి గురించి మరింత సమాచారం కొన్ని రోజులలోనే విడుదల చేయనుంది.
అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్స్ కోసం కొత్త ఇంజిన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి 200 సిసి నుండి 750 సిసి వరకు సామర్థ్యం గల ఇంజన్లతో రానున్నాయి.
మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహన్ లోని బజాజ్ ఆటో ప్లాంట్లో ఈ కొత్త బైక్ మోడల్స్ తయారు చేయబడతాయి. ఇక్కడ తయారు చేసే బైకులు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ కొత్త బైక్లను భారతదేశంలో బజాజ్ ఆటో డీలర్ల ద్వారా విక్రయించనున్నారు.
కొత్త నవీనీకరణలతో రాబోతున్న బజాజ్-ట్రయంప్ మోటార్ సైకిల్స్ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే కెటిఎమ్ డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి వాహనాలను ప్రత్యర్థిగా ఉండవలసి ఉంటుంది. బజాజ్-ట్రయంప్ 200 సిసి బైక్స్ కోసం ఇంకా కొంతకాలం ఎదురు చూడవలసి ఉంటుంది.