వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాయు కాలుష్యానికి అనేక కారణాలు దోహదం చేసినప్పటికీ, వాహనాల ఉద్గారాలు ప్రధాన కారణమని అనేక పరిశోధనలు నిర్ధారించాయి. ఇటీవల కాలంలో ప్రధాన వాహన తయారీదారులు ఇంధనంతో నడిచే వాహనాల ఉత్పత్తిని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ అనుకూలమైనవి.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఇంధన శక్తితో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా సైకిళ్లను ఉపయోగించాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రజలు తమ సొంత వాహనాల వాడకాన్ని తగ్గించాలని మరియు సైకిళ్ల వాడకాన్ని లేదా ప్రజా రవాణాను పెంచాలని సూచించారు.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు ప్రతి పౌరుడి హక్కు అని ఆయన అన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి బెంగళూరులోని చర్చి వీధిలో క్లీన్ ఎయిర్ టెస్ట్బెడ్ డ్రైవ్ ఏర్పాటు చేయబడింది. నగరాన్ని కాలుష్యం నుండి రక్షించడమే ఈ ప్రాజెక్టు, రహదారిపై పాదచారుల రద్దీని మాత్రమే అనుమతిస్తుంది.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

ఈ రహదారిపై పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించారు. వచ్చే ఫిబ్రవరి వరకు ఈ చర్య కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ రహదారిపై ఎలక్ట్రిక్ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కర్ణాటక ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టరేట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఇంగ్లాండ్ లోని కాటాపుల్ట్ నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తోంది.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

ఇందులో భాగంగా చర్చి వీధిలో ట్రాఫిక్ నిషేధించబడింది. కర్ణాటకలో ప్రస్తుతం 85 లక్షలకు పైగా వాహనాలు వాడుకలో ఉన్నాయి. రాష్ట్రంలో 50% వాయు కాలుష్యం జరుగుతోంది ఈ కారణాల వల్ల ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

వాహనాల వినియోగం ప్రతి సంవత్సరం 10% పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రజా రవాణాను ఉపయోగించమని చెప్పారు. సమీప ప్రదేశాలకు వెళ్లడానికి సైక్లింగ్ లేదా నడక మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ నిర్ణయం యొక్క ప్రాథమిక కర్తవ్యం. పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొంటామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన అన్నారు. పర్యావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే భావి తరాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. భావితరాల కోసం మనం ఇప్పటి నుంచి పర్యావరణాన్ని కాపాడటంలో మనవంతు పాత్ర వహించాలని గౌరవ ముఖ్యంమత్రి బి.ఎస్.యడ్యూరప్ప పిలుపునిచ్చారు.

More from DriveSpark

Article Published On: Monday, November 9, 2020, 19:54 [IST]
English summary
Chief Minister Yadiyurappa suggests people to use bicycles to curb pollution. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+