Just In
- 3 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 4 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హార్లే డేవిడ్సన్కు వ్యతిరేకంగా బైక్ ఓనర్స్ ర్యాలీ.. ఎందుకో తెలుసా ?
ప్రఖ్యాత అమెరికన్ బైక్ తయారీ కంపెనీ హార్లే-డేవిడ్సన్ భారతదేశంలో నిలిపివేసిన తరువాత కంపెనీ నిర్ణయంతో కస్టమర్లు మరియు డీలర్లు చాలా కలత చెందుతున్నారు. ఆదివారం, 14 నగరాల్లోని హార్లే-డేవిడ్సన్ కస్టమర్లు కంపెనీ నిర్ణయానికి నిరసనగా బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ విధంగా మనదేశంలో కంపెనీ నిలిచిపోవడంతో తమ డీలర్లకు ఆందోళన కలిగించే విషయం కస్టమర్లు తెలిపారు.
డీలర్షిప్లు మరియు సర్వీస్ కేంద్రాలు మూసివేయడంతో వారు తమ బైక్ల కోసం పార్ట్శ్ మరియు యాక్ససరీస్ పొందడం లేదు. తమ డీలర్లకు, కస్టమర్లకు తెలియజేయకుండా కంపెనీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందని, సర్వీసింగ్, వారంటీ కోసం కంపెనీ ఏర్పాట్లు చేసి ఉండాలని వినియోగదారులు తెలిపారు.
హార్లే-డేవిడ్సన్ 2009 లో భారతదేశంలోకి ప్రవేశించింది. ఏదేమైనా కంపెనీ 11 సంవత్సరాల ప్రయాణంలో భారతదేశంలో కంపెనీ యొక్క లాభాలు మెరుగ్గా లేవు. భారతదేశంలో తక్కువ మార్కెటింగ్ వుంది. దీనికి ప్రధాన కారణం ఈ బైకులు అత్యధిక ధర కలిగి ఉండటమే. కంపెనీ తన బైక్లను చాలావరకు భారత్కు ఎగుమతి చేసింది, దీనిపై టాక్స్ మరియు కస్టమ్ డ్యూటీ కారణంగా బైక్ ధర 25-30 శాతం పెరుగుతుంది.
MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !
ఇదే సమయంలో, 2012 లో రాయల్ ఎన్ఫీల్డ్ తమ బైక్లను భారతదేశంలో తిరిగి ప్రారంభించింది. రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయ వినియోగదారులకు క్రూయిజర్ బైక్లకు చౌకైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. కంపెనీ భారతదేశంలో 350 సిసి నుండి 650 సిసి వరకు బైక్లను విడుదల చేసింది, వీటిని వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
రాయల్ ఎన్ఫీల్డ్ రాక కారణంగా కంపెనీ యొక్క వ్యాపారం నష్టాల్లో కొనసాగింది. 2020 అక్టోబర్లో భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది, దీని నేపథ్యంలో బైక్ డీలర్లు నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల ఎక్కువ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని తెలిపారు.
MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?
ఇది కాకుండా, సంస్థ తిరిగి చెల్లించే విధంగా వారికి పరిహారం ఇవ్వలేదు. సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం గురించి డీలర్లు కూడా మాట్లాడారు. ఇప్పుడు, హార్లే బైకుల కస్టమర్ల ప్రమేయంతో, ఈ నిరసన మరింత విస్తృతంగా జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితం హార్లే-డేవిడ్సన్ 2021 జనవరి నుండి భారతదేశంలో బైక్ సర్వీసింగ్ మరియు వారంటీ సంబంధిత సేవలను ప్రారంభిస్తుందని అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ దేశంలోని అతిపెద్ద బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
MOST READ:కొత్త స్టైల్లో సోనెట్ ఎస్యూవీ డెలివరీ చేసినా కియా మోటార్స్.. ఎలాగో తెలుసా ?