ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ప్రకటన కారణంగా చాలా మంది డీలర్లు షోరూమ్‌లను మూసివేయడం జరిగింది.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా ఆటోమొబైల్ కంపెనీ షోరూమ్‌లను మూసివేశారు. ది ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎక్కువగా క్షీణించాయి. ఇది 11% నుండి 13% కి తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం 20 నుండి 21 లక్షల యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుతం చాలా కంపెనీలు తమ అమ్మకాలను నిలిపివేసాయి.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

ప్రస్తుత పరిస్థితి గురించి ఐసిఆర్‌ఎ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని చెప్పారు. అంతే కాకుండా మిగిలిన బిఎస్ 4 వాహనాలను విక్రయించడానికి సంస్థలపై కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

2020 ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహన సంస్థలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ వల్ల వాహనం ఉత్పత్తులే కాకుండా బిఎస్ 4 వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ఈ కాలంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 16% పడిపోయాయి.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

దేశంలో కార్లు మాత్రం ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. చాలా బైక్ కంపెనీలకు ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశం లేదు. అమ్మకాల పరిమాణం తక్కువగా ఉండటమే దీనికి కారణం.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

భారతదేశంలో దిగువ మరియు మధ్యతరగతి ప్రజలు కరోనా వైరస్ సంక్రమణతో చాలా ఇబ్బందులనుఎదుర్కొంటున్నారు. ఈ వర్గానికి చెందిన కస్టమర్లే ద్విచక్ర వాహనాల ప్రధాన కస్టమర్లు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ద్విచక్ర వాహన సంస్థలు ఈ కస్టమర్లను కోల్పోతున్నాయి మరియు అమ్మకాలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.

ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !

రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వల్ల ఈ లాక్ డౌన్ ని మరింత పొడిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాబట్టి మున్ముందు కూడా ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఏది ఏమైనా భయంకరమైన కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రస్తుత పరిస్థుల్లో చాలా అవసరం అని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 9, 2020, 16:48 [IST]
English summary
Indian two wheeler sales will decline in FY21. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+