Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !
కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ప్రకటన కారణంగా చాలా మంది డీలర్లు షోరూమ్లను మూసివేయడం జరిగింది.

కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా ఆటోమొబైల్ కంపెనీ షోరూమ్లను మూసివేశారు. ది ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎక్కువగా క్షీణించాయి. ఇది 11% నుండి 13% కి తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం 20 నుండి 21 లక్షల యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుతం చాలా కంపెనీలు తమ అమ్మకాలను నిలిపివేసాయి.

ప్రస్తుత పరిస్థితి గురించి ఐసిఆర్ఎ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని చెప్పారు. అంతే కాకుండా మిగిలిన బిఎస్ 4 వాహనాలను విక్రయించడానికి సంస్థలపై కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది.

2020 ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహన సంస్థలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ వల్ల వాహనం ఉత్పత్తులే కాకుండా బిఎస్ 4 వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ఈ కాలంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 16% పడిపోయాయి.

దేశంలో కార్లు మాత్రం ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. చాలా బైక్ కంపెనీలకు ఆన్లైన్లో విక్రయించే అవకాశం లేదు. అమ్మకాల పరిమాణం తక్కువగా ఉండటమే దీనికి కారణం.

భారతదేశంలో దిగువ మరియు మధ్యతరగతి ప్రజలు కరోనా వైరస్ సంక్రమణతో చాలా ఇబ్బందులనుఎదుర్కొంటున్నారు. ఈ వర్గానికి చెందిన కస్టమర్లే ద్విచక్ర వాహనాల ప్రధాన కస్టమర్లు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ద్విచక్ర వాహన సంస్థలు ఈ కస్టమర్లను కోల్పోతున్నాయి మరియు అమ్మకాలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.

రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వల్ల ఈ లాక్ డౌన్ ని మరింత పొడిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాబట్టి మున్ముందు కూడా ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఏది ఏమైనా భయంకరమైన కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రస్తుత పరిస్థుల్లో చాలా అవసరం అని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.