Just In
- 11 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 12 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ద్విచక్ర వాహన అమ్మకాల పాలిటి శాపంగా మారిన కరోనా, ఎందుకో తెలుసా.. !
కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ప్రకటన కారణంగా చాలా మంది డీలర్లు షోరూమ్లను మూసివేయడం జరిగింది.
కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా ఆటోమొబైల్ కంపెనీ షోరూమ్లను మూసివేశారు. ది ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఎక్కువగా క్షీణించాయి. ఇది 11% నుండి 13% కి తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం 20 నుండి 21 లక్షల యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుతం చాలా కంపెనీలు తమ అమ్మకాలను నిలిపివేసాయి.
ప్రస్తుత పరిస్థితి గురించి ఐసిఆర్ఎ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని చెప్పారు. అంతే కాకుండా మిగిలిన బిఎస్ 4 వాహనాలను విక్రయించడానికి సంస్థలపై కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది.
2020 ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహన సంస్థలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ వల్ల వాహనం ఉత్పత్తులే కాకుండా బిఎస్ 4 వాహనాల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ఈ కాలంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 16% పడిపోయాయి.
దేశంలో కార్లు మాత్రం ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. చాలా బైక్ కంపెనీలకు ఆన్లైన్లో విక్రయించే అవకాశం లేదు. అమ్మకాల పరిమాణం తక్కువగా ఉండటమే దీనికి కారణం.
భారతదేశంలో దిగువ మరియు మధ్యతరగతి ప్రజలు కరోనా వైరస్ సంక్రమణతో చాలా ఇబ్బందులనుఎదుర్కొంటున్నారు. ఈ వర్గానికి చెందిన కస్టమర్లే ద్విచక్ర వాహనాల ప్రధాన కస్టమర్లు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ద్విచక్ర వాహన సంస్థలు ఈ కస్టమర్లను కోల్పోతున్నాయి మరియు అమ్మకాలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది.
రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వల్ల ఈ లాక్ డౌన్ ని మరింత పొడిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాబట్టి మున్ముందు కూడా ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఏది ఏమైనా భయంకరమైన కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రస్తుత పరిస్థుల్లో చాలా అవసరం అని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.