Just In
- 39 min ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 16 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
Don't Miss
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జావా 42 బైక్ డెలివరీ : ఆనందంలో మహిళ
ఇటీవల కాలంలో యువకులందరిని ఉర్రూతలూగిస్తున్న మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మరియు జావా బైక్స్. ఈ జావా బైక్ చాలామంది యొక్క కలల వాహనం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మాత్రమే కాకుండా జావా బైక్ కూడా చాలామంది ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనం.
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా మాత్రం పరిమితంగానే జరుగుతూ ఉంది. సాధారణంగా తమకు ఇష్టమైన బైక్ కలిగి ఉన్నట్లయితే ఆ అనుభవం చాలా భిన్నంగా ఉంటుంది. మైసూర్ లో ఇలాంటి అనుభవమే ఒక మహిళకు కలిగింది. మైసూర్ కి చెందిన ఈ మహిళా తనకి ఇష్టమైన జావా 42 బైకుని డెలివరీ చేసుకుంది.
ఈ జావా 42 బైక్ డెలివరీ పొందిన మహిళ పేరు నందిని. జావా బైకుని పొందిన ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన దాని ప్రకారం, తాను గత జనవరి 7 న ఈ బైక్ను బుక్ చేసుకున్నట్లు చెప్పారు. అదే నెల 21 న ఈ బైక్ డెలివరీ చేయబడిందని తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్లో తెలిపింది.
జావా బైకులు బుక్ చేసుకున్న తరువాత వాటి డెలివరీల కోసం కొన్ని నెలలు వేచి ఉండాలి. అప్డేట్ చేసిన జావా బైక్ చాలామంది వినియోగదారులు బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ బైకుల డెలివరీలో మాత్రం కొంత గందరగోళం నెలకొంది.
జావా బైక్స్ బుక్ చేసుకున్న తరువాత చాల మంది బుకింగ్స్ రద్దు చేయబడ్డాయి. ఈ కారణంగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. జావా మరియు జావా 42 బైక్ల ఉత్పత్తిని పెంచుతామని క్లాసిక్ లెజెండ్స్ ప్రకటించింది. ఈ విధంగా ఉత్పత్తిని పెంచడం వల్ల బుక్ చేసుకున్న అందరి వినియోగదారులకు డెలివరీ చేయవచ్చు.
జావా బైక్ డెలివరీ ఇంత కష్టంగా ఉన్న తరుణంలో కూడా నందినికి చాలా తొందరా తాను బుక్ చేసుకున్న తన అభిమాన బైక్ డెలివరీ చేయబడింది. జావా 42 బైక్లు దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్లతో పోటీపడుతున్నాయి. ఈ బైక్ జావా కంపెనీ ఎంట్రీ లెవల్ బైక్.
జావా 42 బైక్లో 293 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 27 బిహెచ్పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ డ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ను కలిగి ఉంది. జావా బైక్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. జావా కంపెనీ ప్రస్తుతం జావా మరియు జావా 42 బైక్లను విక్రయిస్తోంది.
View this post on InstagramA post shared by NaNdiNi (@nandini.n8) on
అదనంగా బైక్ పెరాక్ గత సంవత్సరం చివరిలో లాంచ్ చేయబడింది. ఈ బైక్ ధర రూ. 1.94 లక్షలు. జావా పెరాక్ మోటార్ సైకిల్ పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు.
ఈ బైక్లో 334 సిసి, ఫోర్-స్ట్రోక్, ఫ్యూయల్ ఇంజెక్షన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 30 బిహెచ్పి పవర్ మరియు 31 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్కు బుకింగ్లు ప్రారంభించబడ్డాయి మరియు ఏప్రిల్ నాటికి బైక్లు పంపిణీ చేయబడతాయి.
Image Courtesy: NaNdiNi/Instagram