Just In
- 21 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 23 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్కే పూజలు, నైవేద్యాలు.. ఎక్కడో తెలుసా ?
ఇటీవల కాలంలో చాలామంది వాహనప్రియులు ఎక్కువగా ఇష్టపడే ద్విచక్ర వాహనాలలో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్. సాధారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ చూడటానికి చాలా లగ్జరీగా ఉండటమే కాకూండా ఒక హుందా రైడింగ్ ని అందిస్తుంది. భారత మార్కెట్లో కూడా వీటి అమ్మకాలు యమా జోరుగా ఉన్నాయి. మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక బైక్ అని మాత్రమే తెలుసు, కానీ మనదేశంలో అక్కడ ఏకంగా గుడి కట్టి పూజించేస్తున్నారు.. ఇంతకీ ఎక్కడో, ఏంటో మీకు తెలుసా.. అయితే దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

రాజస్థాన్ రాష్ట్రంలో జోద్పూర్కు 47 కిమీల దూరంలో ఉన్న పాలి జాతీయ రహదారి పక్కన ఓం బన్నా అనే పేరుతో బుల్లెట్ బాబా గుడి ఉంది. ఎక్కడైనా ప్రజలు తమకు ఇష్టమైన దేవతలను వివిధ రకాల నమ్మకాలతో ఎంతో భక్తిగా పూజించడం మనం చూసాం, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కి అక్కడ గుడి కట్టి అనునిత్యం పూజలు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, దీని వెనుక ఉన్న చరిత్ర పుటల్ని మనం తిరగేసినట్లైతే ?

ఓం బన్నా చరిత్ర :
డిసెంబర్ 2, 1988 వ సంవత్సరం ఓం సింగ్ రాథోడ్ (ఓం బన్నా) తన రాయల్ ఎన్ ఫీల్డ్ 350 సీసీ బైక్ పై చోటిలా అనే ఊరికి బయల్దేరాడు. గ్రామానికి కొంత సమీపంలోనే బైక్ ఒక చెట్టుకు ఢీ కొనింది. దీంతో ఓం బన్నా పక్కనే ఉన్న ఒక గుంతలో పడిపోయాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.
MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం బన్నా అనే వ్యక్తి 1991 డిసెంబర్ 2న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై చోటిలా అనే ఊరికి బయలుదేరాడు. చోటిలా గ్రామానికి సమీపంలో ఒక చెట్టుని ఢీ కొట్టి పక్కనే ఉన్న గుంతలో రాథోడ్ పది అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బుల్లెట్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టారు.

పోలీసులు బుల్లెట్ను పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత మరుసటిరోజుకే ఆ బుల్లెట్ మాయమై ఓం సింగ్ రాథోడ్ ఎక్కడైతే మరణించాడా అక్కడ కనిపించింది. కానీ పోలీసులు ఎవరో ఆకతాయిలు ఈ బైక్ ను తీసుకు వచ్చి ఇక్కడ పెట్టి ఉంటారు అనుకుని, మళ్ళీ దానిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.
ఈ సారి పోలీసులు బైక్ లోని పెట్రోల్ మొత్తం తీసేసారు, అయినప్పటికీ తర్వాత రోజు పోలీస్ స్టేషన్ లో మాయమై అదే ఘటనా స్థలంలో కనిపించింది. పోలీసులు ఎన్ని సార్లు ఈ బైక్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పటికీ అది మళ్లీ మళ్ళీ అదే స్థలానికి చేరుకునేది. దీంతో పోలీసులు ఆ బుల్లెట్ బైకుని అక్కడే వదిలేశారు.
MOST READ:యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

అక్కడ వున్న స్థానికులు మాత్రం ఇదంతా ఓం బన్నా (ఓం సింగ్ రాథోడ్) ఆత్మ ఇదంతా చేస్తున్నాడని నమ్మారు. నమ్మడమే కాదు ఓం బన్నా దేవునితో సమానమని భావించి ఆ గుంత దగ్గరే గుడి కట్టి "బుల్లెట్ బాబా" అనే పేరుతో దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు.

మొదట్లో ఆ గుడికి స్థానికులు తప్పా ఇతరులు వచ్చేవారు కాదు. కానీ కాలక్రమంలో స్థానికులు ఓం బన్నా ఆత్మా తిరుగుతున్నాడని, పూజిస్తే కోరికలు తీరుస్తాడని గట్టిగా నమ్మడంతో, మెల్లమెల్లగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ గుడికి రావడం ప్రారంభించారు. రోడ్డుపై వెళ్లే వారు ఈ గుడిని దర్శించి వెళ్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని గట్టిగా నమ్మేశారు.
MOST READ:చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

బుల్లెట్ బాబా నిజంగా కోరికలు తీరుస్తాడా.. మీరు కూడా ఈ బుల్లెట్ బాబా దేవాలయాన్ని చూడాలనుకుంటున్నారా.. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్పూర్ దగ్గర ఉన్న చోటిలా గ్రామాన్ని ఒకసారి తప్పక చూడండి.