Just In
- 6 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 6 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 8 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 9 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్వరలో రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ; చూసారా ?
ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన దేశంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్ దృష్ట్యా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క నమూనాను సిద్ధం చేయడం ప్రారంభించింది.
ఇటీవల కాలంలో చాలామంది వాహనదారులు ఇష్టపడే బైక్ లలో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్. దీనికోసం కంపెనీ ఎలక్ట్రిక్ బైక్లను ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రజల అవసరానికి అనుగుణంగా సౌకర్యవంతంగా ఉండేలా కృషి చేస్తోందని కంపెనీ వెల్లడించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ నివేదికల ప్రకారం, ఎలక్ట్రిక్ బైక్ ప్రోటోటైప్పై కంపెనీ చాలా కాలంగా పనిచేస్తోంది. ఈ విభాగంలో ఇంధనంతో నడిచే బైక్ను భర్తీ చేయగల విధంగా బైక్ను ఏ విభాగంలో లాంచ్ చేయాలో కూడా ఈ బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు.
MOST READ:అరుదైన పాతకాలపు కారు కొన్న M.S ధోని : దీని రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు
ఎలక్ట్రిక్ బైక్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ తీవ్రంగా కృషి చేస్తోంది. నాణ్యత, దృఢత్వం, పరిధితో సహా అన్ని కీలక పారామితులను పరీక్షించిన తర్వాతే ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభించబడుతుంది. కొన్ని నెలల్లో ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ టెస్టింగ్ కూడా ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
గత సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 20 శాతం పెరిగి 150,000 వాహనాలకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ఖర్చుతో సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీలు తాయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ విభాగంలో ఎలక్ట్రిక్ బైక్లు తమ ఇన్నింగ్స్ ఇంకా తెరవలేదు.
MOST READ:అరుదైన పాతకాలపు కారు కొన్న M.S ధోని : దీని రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు
భారతదేశంలో ఇప్పటికే హీరో మోటోకార్ప్, బజాజ్, టివిఎస్, హోండా, సుజుకి, యమహా వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై పనిచేస్తున్నాయి. అదే సమయంలో దేశంలోని కొన్ని స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి.
మే మరియు జూన్ నెలల్లో మాంద్యం తరువాత జూలై నుండి అమ్మకాలు పెరగడం ప్రారంభించాయని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు అమ్మకాలు జరగనప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఏఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయితే ఎక్కువ అమ్మకాలను సాగించే అవకాశం లేకపోలేదు.
MOST READ:భారత్లో అడుగుపెట్టిన ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ బైక్ రేటెంతో తెలుసా ?