Just In
- 22 min ago Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- 1 hr ago కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- 3 hrs ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 3 hrs ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
Don't Miss
- News TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్ధుల ప్రకటనకు ముహుర్తం ఖరారు..!
- Movies SS Rajamouli బాహుబలి నిర్మాతలతో రాజమౌళి కొడుకు సినిమా.. అంతకు మించి అంటూ ఊరిస్తూ..!
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
త్వరలో రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ; చూసారా ?
ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన దేశంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్ దృష్ట్యా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క నమూనాను సిద్ధం చేయడం ప్రారంభించింది.
ఇటీవల కాలంలో చాలామంది వాహనదారులు ఇష్టపడే బైక్ లలో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్. దీనికోసం కంపెనీ ఎలక్ట్రిక్ బైక్లను ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రజల అవసరానికి అనుగుణంగా సౌకర్యవంతంగా ఉండేలా కృషి చేస్తోందని కంపెనీ వెల్లడించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ నివేదికల ప్రకారం, ఎలక్ట్రిక్ బైక్ ప్రోటోటైప్పై కంపెనీ చాలా కాలంగా పనిచేస్తోంది. ఈ విభాగంలో ఇంధనంతో నడిచే బైక్ను భర్తీ చేయగల విధంగా బైక్ను ఏ విభాగంలో లాంచ్ చేయాలో కూడా ఈ బృందం సభ్యులు పరిశీలిస్తున్నారు.
MOST READ:అరుదైన పాతకాలపు కారు కొన్న M.S ధోని : దీని రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు
ఎలక్ట్రిక్ బైక్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ తీవ్రంగా కృషి చేస్తోంది. నాణ్యత, దృఢత్వం, పరిధితో సహా అన్ని కీలక పారామితులను పరీక్షించిన తర్వాతే ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభించబడుతుంది. కొన్ని నెలల్లో ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ టెస్టింగ్ కూడా ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
గత సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 20 శాతం పెరిగి 150,000 వాహనాలకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ఖర్చుతో సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీలు తాయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ విభాగంలో ఎలక్ట్రిక్ బైక్లు తమ ఇన్నింగ్స్ ఇంకా తెరవలేదు.
MOST READ:అరుదైన పాతకాలపు కారు కొన్న M.S ధోని : దీని రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు
భారతదేశంలో ఇప్పటికే హీరో మోటోకార్ప్, బజాజ్, టివిఎస్, హోండా, సుజుకి, యమహా వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై పనిచేస్తున్నాయి. అదే సమయంలో దేశంలోని కొన్ని స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి.
మే మరియు జూన్ నెలల్లో మాంద్యం తరువాత జూలై నుండి అమ్మకాలు పెరగడం ప్రారంభించాయని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. కరోనా మహమ్మారికి ముందు అమ్మకాలు జరగనప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఏఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయితే ఎక్కువ అమ్మకాలను సాగించే అవకాశం లేకపోలేదు.
MOST READ:భారత్లో అడుగుపెట్టిన ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ బైక్ రేటెంతో తెలుసా ?