Just In
- 13 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 15 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 15 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 17 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వచ్చే 7 సంవత్సరాలలో 28 కొత్త బైక్లను పరిచయం చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ రాబోయే 7 సంవత్సరాలలో 28 కొత్త బైక్లను విడుదల చేయనున్నట్లు సంస్థ సీఈఓ వినోద్ కె దాసరి తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి మూడవ నెలలో ఒక బైక్ను టేకాఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోందని, ఈ విధంగా చేసినట్లయితే ఒక సంవత్సరంలో నాలుగు బైక్లు లాంచ్ అవుతాయని చెప్పారు. దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ కంపెనీ విస్తృతమైన పురోగతి సాధిస్తోందని చెప్పారు.
250-350 సిసి మధ్య విభాగంలో వాహనాలను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకారం, భారతదేశంతో సహా ఆసియాలోని ఇతర దేశాలలో మిడ్-సెగ్మెంట్ బైక్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. 100-150 సిసి ప్రయాణికుల విభాగంలో ఇప్పటికే చాలా ఎంపికలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 350-650 సిసిలలో కొత్త మరియు సరసమైన బైక్ల ఎంపికను కంపెనీ అందిస్తుంది.
350-650 సిసి విభాగంలో కంపెనీ బైక్లు ఇతర కంపెనీ బైక్ల కంటే చౌకగా ఉన్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు, ఎందుకంటే ఇది కంపెనీ ప్రత్యేకత.
MOST READ:విజయవాడ మునిసిపాలిటీకి పంపిణీ చేయబడ్డ టాటా ఏస్ మినీ ట్రక్స్.. ఎందుకో తెలుసా ?
రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకారం, యూరప్ మరియు దక్షిణ ఆసియాలోని దేశాలలో కంపెనీ యొక్క ఈ బైక్ యొక్క డిమాండ్స్ రోజు రోజుకి పెరుగుతోంది. ఈ సంస్థ భారతదేశం, అర్జెంటీనా వెలుపల అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది మరియు రాబోయే నెలల్లో థాయిలాండ్ మరియు బ్రెజిల్లో అసెంబ్లింగ్ ప్లాంట్లను కూడా ప్రారంభించే ఆలోచనల్లో ఉంది.
సీఈఓ వినోద్ దాసరి మాట్లాడుతూ, ఈ సంవత్సరం, కోవిడ్-19 నాలుగు నెలల పాటు అమ్మకాలలో భారీ తిరోగమనాన్ని నమోదు చేసింది, అయితే 2020 అక్టోబర్ నుండి, కోవిడ్-19 కంటే ముందు వున్న అమ్మకాల కంటే మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే భారీ పెరుగుదల ఉంది.
MOST READ:కిడ్నీ తరలించడానికి లంబోర్ఘిని కారు ఉపయోగించిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?
కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కంపెనీ తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా బైక్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ 2-3 సంవత్సరాల రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. ఈ సమయంలో కంపెనీ బైక్ను అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెడుతుంది.
సీఈఓ వినోద్ దాసరి మాట్లాడుతూ, కంపెనీ అమ్మకాల విషయంలో బాగానే ఉంది. గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ గత ఏడాది కాలంగా యుకెలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్గా మారింది. భారతదేశం ఎగుమతి చేస్తోంది. ఏది ఏమైనా రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మంది వాహన ప్రియులకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
MOST READ:మీకు తెలుసా.. త్వరలో మన హైదరాబాద్కు రానున్న కొత్త రేస్ ట్రాక్