రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 2020 ఏప్రిల్ లో ఎలా ఉన్నాయో చూసారా ?
చెన్నైకి చెందిన మోటార్ సైకిల్ తయారీ సంస్థ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహన తయారీదారులలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో ఒకటి. ఈ కంపెనీ కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ 2020 ఏప్రిల్ నెలలో 91 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంతకుముందు భారతదేశం మరియు యునైటెడ్ కింగ్ డమ్ అంతటా తమ కార్యకలాపాలు మరియు తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కార్పొరేట్ కార్యాలయాలు మరియు డీలర్షిప్లు మార్చి 23 నుండి మూసివేయబడ్డాయి.

కంపెనీ తిన్నోట్టియూర్, ఒరగాడమ్ మరియు చెన్నైలోని వల్లం వడగల్ ప్లాంట్లు, మరియు డీలర్షిప్లతో సహా మొత్తం సరఫరా 2020 ఏప్రిల్ నెల వరకు దేశవ్యాప్తంగా మూసివేయబడ్డాయి.

సంబంధిత వార్తలలో రాయల్ ఎన్ఫీల్డ్ 2020 మార్చి నెలలో ఎగుమతి అమ్మకాలలో 33 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019 మార్చిలో ఎగుమతి చేసిన 2,397 యూనిట్లతో పోలిస్తే ఈ నెలలో బ్రాండ్ 3,184 యూనిట్లను ఎగుమతి చేసింది. సంస్థ యొక్క 650 ట్విన్ మోడల్స్ సంవత్సర వృద్ధిలో 25.30 శాతం నమోదయ్యాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త 350 సిసి సమర్పణ అయిన మేటోర్ ఫైర్బాల్ను ఈ ఏడాది చివర్లో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మోటారుసైకిల్ అనేకసార్లు టెస్ట్ చేసినప్పుడు గుర్తించబడింది. ఈ బైక్ యొక్క చిత్రాలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ కొత్త బైక్ మెటియోర్ లో పెద్దగా డిజైన్ మార్పులేవీ లేనప్పటికీ, ఇందులో రౌండ్ హెడ్ల్యాంప్ అసెంబ్లీ, స్ప్లిట్ సీట్లు, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లాక్ అవుట్ ఇంజిన్ మరియు రెట్రో స్టైల్ ఉన్నాయి అంతే కాకుండా ఇందులో టైల్ లైట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే చాలా ఆటో సంస్థలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. ఈ కారణంగా దాదాపు చాలా కామపెనీలు ఏమాత్రం తమ ఉత్పత్తులను అమ్మడానికి వీలులేకుండా పోయింది. అంతే కాకుండా గత నెలలో హోండా మరియు మారుతీ వంటి కంపెనీలు సున్నా అమ్మకాలను నమోదు చేశాయి.


Click it and Unblock the Notifications








