Just In
- 2 hrs ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 5 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 6 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 6 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన సంస్థ సుజుకి మోటార్ సైకిల్. సుజుకి కంపెనీ చాల వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కానీ భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాపించడం వల్ల కంపెనీ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పడు దేశ వ్యాప్తంగా నాల్గవ దశ లాక్ డౌన్ మొదలైంది. భారత ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని నిబంధనల ప్రకారం మళ్ళీ కంపెనీ తమ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించింది.
భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు లాక్ డౌన్ 4.0 నుండి అమలు చేయబడింది. ఇదిలావుండగా ప్రఖ్యాత బైక్ తయారీ సంస్థ సుజుకి మోటార్సైకిల్ హర్యానాలోని గురుగ్రామ్లో తన తయారీ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్థానిక పరిపాలన నుండి అనుమతి పొందిన తరువాత ఉత్పత్తిని ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.
ఉత్పత్తి సమయంలో కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఆదేశించినదాని ప్రకారం సామాజిక దూరాన్ని నిర్వహించడం సహా ఇతర నిబంధనలను పాటిస్తామని కంపెనీ తెలిపింది. సుజుకి మోటార్సైకిల్ కంపెనీ 2020 మార్చి 23 నుంచి ఉత్పత్తిని నిలిపివేసింది.
MOST READ:అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన బిఎస్ 6 నిస్సాన్ కిక్స్
కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సుజుకి మోటార్సైకిల్ తన తయారీ కర్మాగారాలను నిలిపివేసింది. 55 రోజుల తర్వాత కంపెనీ తన తయారీ కర్మాగారంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తుంది.
దీని గురించి సుజుకి మోటార్సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కొచ్చిరో హిరావ్ మాట్లాడుతూ ప్రారంభంలో సుజుకి మోటార్సైకిల్ కంపెనీ పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పూర్తి స్థాయిలో ఉత్పత్తిని లాక్ డౌన్ పూర్తిగా తీసివేరిన తరువాత ప్రారంభిస్తామని చెప్పారు.
MOST READ:సన్నీలియోన్ మనసు దోచుకున్న పింక్ అంబాసిడర్.. మ్యాటర్ ఏంటంటే ?
కరోనావైరస్ అంటూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామాజిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ మరియు నాన్-మొబిలైజేషన్ సహా పలు రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తెలిపింది.
సంస్థ తన తయారీ కర్మాగారంలో క్రిమిసంహారక గదిని కూడా నిర్మించింది. ప్రతి ఉద్యోగి ప్రతిరోజూ ఈ గది గుండా వెళ్ళాలి. ఇది సంక్రమణ వ్యాప్తిని నిరోధిస్తుంది. ఇప్పుడు ప్రారంభ దశలో తక్కువమంది ఉద్యోగులతో ప్రారంభిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోవడం వల్ల కంపెనీ ఆర్థికంగా బాగా దిగజారింది. ఇప్పుడు మళ్ళీ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సరైన క్రమంలోకి రావడానికి అవకాశం ఉంటుంది.
MOST READ:ఇండియాలో 2020 ఎఎమ్జి జిటి-ఆర్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన మెర్సిడెస్ బెంజ్