Just In
- 14 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 16 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 16 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 18 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Movies Guppedantha Manasu April 18th: కాలేజీ నుంచి వెళ్లిపోయిన మహేంద్ర.. మను దత్తత.. టెన్షన్లో దేవయాని!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కరోనా వేళ ప్రజలను నియంత్రించడానికి మేము సైతం అంటున్న మహిళా పోలీసులు, ఎక్కడో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ ఇప్ప్పుడు భారతదేశంలో కూడా ఎక్కువ సంఖ్యలో విస్తరిస్తోంది. ఈ కరోనా మహమ్మారి ఇప్పటికే భారతదేశంలో 15,000 మందికి సోకినట్లు నివేదిక చెబుతున్నాయి.
భారతదేశంలో కరోనా వైరస్ మొట్టమొదట కేరళ రాష్ట్రంలో కనిపించింది. కేరళ మొదట్లో తిరగబడింది. ఇతర రాష్ట్రాలు దేవుడు ను శపించాడని చమత్కరించారు. కానీ నేడు కేరళ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది.
కరోనాపై పోరాటంలో కేరళ ప్రభుత్వం ప్రజలపై వివిధ ఆంక్షలు విధించింది. అంతే కాకుండా అనేక కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఫలితంగా ప్రారంభంలో వైరస్ సంక్రమణతో బాధపడుతున్న కేరళ పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది.
ఈ కారణంగానే కేరళ భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణను నివారించగలిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ఇది సాధ్యమవుతుంది. అదే సమయంలో ప్రజలు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
కేరళలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా పెరిగింది. తక్కువ సంఖ్యలో వైరల్ ఇన్ఫెక్షన్లను నిర్మూలించడానికి కేరళలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి కేరళలోని ప్రధాన నగరాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.
MOST READ: కరోనా ఎఫెక్ట్ : ఇండియాలో హీరో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ ఇక ఎప్పుడో తెలుసా..?
కేరళలోని ప్రధాన నగరాల్లో ఒకటైన త్రిస్సూర్లో ప్రత్యేక మహిళా దళం ఏర్పాటు చేయబడింది. నగరం యొక్క అన్ని మూలల్లో ఈ మహిళా పోలీసులు తురుగుతున్నారు. ప్రజలు బయటికి రాకుండా చర్యలను తీసుకుంటున్నారు.
కేరళ రాష్ట్రంలోని మహిళా పోలీసు బలగాలు వృద్ధులు, మహిళలు మరియు పిల్లలకు సహాయం చేస్తున్నారు. ఈ ప్రత్యేక మహిళా దళానికి రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క బుల్లెట్ బైక్లు వినియోగిస్తున్నారు. ఈ మహిళా శక్తి సింగంలో నటుడు సూర్యలాగా విజృభిస్తున్నారు.
MOST READ:పాదచారుల ఓవర్పాస్పై కార్ డ్రైవ్ చేయడం ఎప్పుడైనా చూసారా..!
ప్రతి బైక్లో ఇద్దరు మహిళా గార్డ్లు ఉంటారు. వారు అదే హెల్మెట్లను కూడా వినియోగిస్తున్నారు. అదనంగా వైరస్ సంక్రమణ నుండి రక్షించడానికి మాస్కులు మరియు క్రిమినాశక మందులు కూడా అందించారు.
భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకి మరింత ఎక్కువవుతున్న సమయంలో లాక్ డౌన్ వ్యవధిని 2020 మే 3 వరకు పొడిగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకుండా నిరోధించడం ప్రతి రాష్ట్ర ప్రభుత్వ విధి. కేరళ ప్రభుత్వం ప్రత్యేక మహిళా దళాన్ని ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు.
MOST READ: కరోనా ఎఫెక్ట్ : వాయిదా పడిన స్కోడా ఆక్టావియా లాంచ్