Just In
- 20 min ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 1 hr ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 3 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 5 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
Don't Miss
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Movies Tillu Square Collections తొలి రోజే సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్ష
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మీకు తెలుసా.. అతి తక్కువ ధరకే షియోమి ఎలక్ట్రిక్ స్కూటర్
మొబైల్ ఫోన్ తయారీదారు అయిన షియోమి, మొబైల్ తయారీ మాత్రమే కాకుండా ఇతర నిత్యావసరాలను కూడా తయారు చేస్తుంది. షియోమి మాస్కులు మరియు ఎయిర్ ఫిల్టర్లను కూడా తయారు చేస్తుంది మరియు విక్రయిస్తుంది.
షియోమి ఇయర్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ ప్యాంట్లు, వాచ్, సూట్కేస్, సిసిటివి కెమెరా మరియు వై-ఫై ఎక్స్-టెండర్తో సహా పలు రకాల పరికరాలను కూడా తయారు చేసి విక్రయిస్తుంది. షియోమి తన అమ్మకాలను విస్తరించే ఉద్దేశ్యంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని కూడా ఇటీవల ప్రారంభించింది. షియోమి యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ మోపెడ్లను చైనాలో విక్రయిస్తున్నారు. కంపెనీ యొక్క ఇతర ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లు ప్రస్తుతం చైనాలో మాత్రమే విడుదలవుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లను త్వరలో భారత్తో సహా వివిధ దేశాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
చైనాలో ఎలక్ట్రిక్ మోపెడ్లను విడుదల చేసిన మొట్టమొదటి చైనా కంపెనీ షియోమి. ఎ 1 మరియు ఎ 1 ప్రో ఎలక్ట్రిక్ మోపెడ్లను చైనాలో చాలా తక్కువ ధరలకు విడుదల చేశారు.
ఈ మోపెడ్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల పట్టణ వినియోగం కోసం ఇవి చాలా ఉంపయోగపడతాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లలో 16 అంగుళాల చక్రాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటారు దీని సీటు కింద అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు 750 వాట్ల సామర్థ్యం కలిగి ఉంది.
నగర వినియోగం కోసం అభివృద్ధి చేయబడిన ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ మోపెడ్లో ఒక సీటు మాత్రమే అమర్చారు. ఈ షియోమీ యొక్క రెండు మోడల్స్ లో రెండు వేర్వేరు బ్యాటరీలు ఉంటాయి.
ఎ 1 మోపెడ్లో మోబిటెల్ 768 సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడిన తరువాత దాదాపు 60 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
ఎ 1 ప్రో మోపెడ్ 960 వాట్ల బ్యాటరీని కలిగి ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయబడిన 70 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ మోపెడ్లలో పెడల్స్ కూడా అందించబడతాయి. ఈ మోపెడ్లను సైకిళ్ళు మరియు ఎలక్ట్రిక్ మోపెడ్లుగా ఉపయోగించవచ్చు. ఈ మొబిటెల్ బ్యాటరీలు ప్రత్యేక ఛార్జర్ను అందిస్తాయి. దీని బ్యాటరీ క్షీణించిన తరువాత దానిని సురక్షితంగా తీసివేసి ఇంట్లో లేదా కార్యాలయంలో రీఛార్జ్ చేయవచ్చు.
ఎ 1 మరియు ఎ 1 ప్రో ఎలక్ట్రిక్ మోపెడ్లో టిఎఫ్టి కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఎల్ఇడి లైటింగ్ ఉన్నాయి. ఎ1 ప్రో టచ్ స్క్రీన్ వాయిస్ కంట్రోలర్ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ మోపెడ్లు అధిక నాణ్యత గల వీడియో రికార్డింగ్ కెమెరాలను కూడా కలిగి ఉంటాయి.
అధిక ఫీచర్స్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లను తక్కువ ధరకే లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ల ప్రారంభ ధర ఇండియాలో రూ. 31,633 వరకు ఉంటుంది. ఇది బిఎస్ 6 టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ కంటే తక్కువ. భారతదేశంలో టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ధర రూ. 42,283 వరకు ఉంది. ఏది ఏమైనా అతి తక్కువ ధరకు లభించే ఈ షియోమి ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు చాల అనుకూలంగా ఉంటుంది.