Just In
- 1 hr ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 16 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 16 hrs ago హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
- 18 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
Don't Miss
- News పవన్ కల్యాణ్కు హ్యాండిచ్చిన కీలక నేత
- Finance Google Layoffs: ఉద్యోగులను మళ్లీ తగ్గించిన గూగుల్.. భారతీయ టెక్కీలపై భారీ ప్రభావం..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
మీకు తెలుసా.. అతి తక్కువ ధరకే షియోమి ఎలక్ట్రిక్ స్కూటర్
మొబైల్ ఫోన్ తయారీదారు అయిన షియోమి, మొబైల్ తయారీ మాత్రమే కాకుండా ఇతర నిత్యావసరాలను కూడా తయారు చేస్తుంది. షియోమి మాస్కులు మరియు ఎయిర్ ఫిల్టర్లను కూడా తయారు చేస్తుంది మరియు విక్రయిస్తుంది.
షియోమి ఇయర్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్ ప్యాంట్లు, వాచ్, సూట్కేస్, సిసిటివి కెమెరా మరియు వై-ఫై ఎక్స్-టెండర్తో సహా పలు రకాల పరికరాలను కూడా తయారు చేసి విక్రయిస్తుంది. షియోమి తన అమ్మకాలను విస్తరించే ఉద్దేశ్యంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని కూడా ఇటీవల ప్రారంభించింది. షియోమి యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ మోపెడ్లను చైనాలో విక్రయిస్తున్నారు. కంపెనీ యొక్క ఇతర ఉత్పత్తుల మాదిరిగా కాకుండా, ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లు ప్రస్తుతం చైనాలో మాత్రమే విడుదలవుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లను త్వరలో భారత్తో సహా వివిధ దేశాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
చైనాలో ఎలక్ట్రిక్ మోపెడ్లను విడుదల చేసిన మొట్టమొదటి చైనా కంపెనీ షియోమి. ఎ 1 మరియు ఎ 1 ప్రో ఎలక్ట్రిక్ మోపెడ్లను చైనాలో చాలా తక్కువ ధరలకు విడుదల చేశారు.
ఈ మోపెడ్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఈ విధంగా ఉండటం వల్ల పట్టణ వినియోగం కోసం ఇవి చాలా ఉంపయోగపడతాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లలో 16 అంగుళాల చక్రాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటారు దీని సీటు కింద అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు 750 వాట్ల సామర్థ్యం కలిగి ఉంది.
నగర వినియోగం కోసం అభివృద్ధి చేయబడిన ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ మోపెడ్లో ఒక సీటు మాత్రమే అమర్చారు. ఈ షియోమీ యొక్క రెండు మోడల్స్ లో రెండు వేర్వేరు బ్యాటరీలు ఉంటాయి.
ఎ 1 మోపెడ్లో మోబిటెల్ 768 సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడిన తరువాత దాదాపు 60 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
ఎ 1 ప్రో మోపెడ్ 960 వాట్ల బ్యాటరీని కలిగి ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయబడిన 70 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ మోపెడ్లలో పెడల్స్ కూడా అందించబడతాయి. ఈ మోపెడ్లను సైకిళ్ళు మరియు ఎలక్ట్రిక్ మోపెడ్లుగా ఉపయోగించవచ్చు. ఈ మొబిటెల్ బ్యాటరీలు ప్రత్యేక ఛార్జర్ను అందిస్తాయి. దీని బ్యాటరీ క్షీణించిన తరువాత దానిని సురక్షితంగా తీసివేసి ఇంట్లో లేదా కార్యాలయంలో రీఛార్జ్ చేయవచ్చు.
ఎ 1 మరియు ఎ 1 ప్రో ఎలక్ట్రిక్ మోపెడ్లో టిఎఫ్టి కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఎల్ఇడి లైటింగ్ ఉన్నాయి. ఎ1 ప్రో టచ్ స్క్రీన్ వాయిస్ కంట్రోలర్ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ మోపెడ్లు అధిక నాణ్యత గల వీడియో రికార్డింగ్ కెమెరాలను కూడా కలిగి ఉంటాయి.
అధిక ఫీచర్స్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ మోపెడ్లను తక్కువ ధరకే లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ల ప్రారంభ ధర ఇండియాలో రూ. 31,633 వరకు ఉంటుంది. ఇది బిఎస్ 6 టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ కంటే తక్కువ. భారతదేశంలో టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ధర రూ. 42,283 వరకు ఉంది. ఏది ఏమైనా అతి తక్కువ ధరకు లభించే ఈ షియోమి ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు చాల అనుకూలంగా ఉంటుంది.