Just In
- 1 hr ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
- 3 hrs ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 17 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
Don't Miss
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా నివారణకు యమహా కంపెనీ సిబ్బంది ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?
భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా క్షీనించింది.
కరోనా నియంత్రణకు పాటు పడుతున్న ప్రభుత్వానికి చాలా మంది సినీ పరిశ్రమల వారు మరియు ఆటో పరిశ్రమలు ఎక్కువ మద్దతుని ప్రకటించాయి. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో విరాళాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో యమహా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఒకరోజు జీతాన్ని సహాయనిధికి అందించడం జరిగింది.
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి, యమహా మోటార్ ఇండియా ఉద్యోగులు ఒకరోజు జీతం సేకరించి మొత్తం రూ. 61.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. యమహా ఈ రోజు ఈ విషయం గురించి తెలియజేసింది.
MOST READ:లాక్డౌన్లో కొడుకుని తీసుకురావడానికి 14,000 కి.మీ స్కూటర్లో ప్రయాణించిన దివ్యాంగ మహిళ
ఈ విరాళంలో తమిళనాడు ప్రభుత్వానికి రూ. 25 లక్షలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 25 లక్షలు, ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 11.5 లక్షలు అందించారు. విరాళాలను అందించిన దాతలలో శాశ్వత ఉద్యోగులు, కార్మికవర్గ అధికారులు, బ్లూ కాలర్ ఉద్యోగులు, తమిళనాడులోని కాంచీపురం ఉద్యోగులు, ఉత్తర ప్రదేశ్లోని సూరజ్పూర్, హర్యానాలోని ఫరీదాబాద్ ఉద్యోగులు ఉన్నారు.
కరోనా వైరస్ పై పోరాడటానికి చెన్నైలోని కార్పొరేట్ కార్యాలయాలు మరియు భారతదేశం అంతటా ఫీల్డ్ కార్యాలయాలు విరాళం ఇచ్చాయి. ఇది ప్రపంచ సంక్షోభం అని యమహా మోటార్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టేకిరో హెన్మి తెలిపారు. గ్లోబల్ కంపెనీగా యమహా పాత్ర చాలా ఎక్కువగా ఉంది.
MOST READ:భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు
ఈ కరోనా సమయంలో కోవిడ్ -19 మమ్మల్ని ఏకం చేసింది. ఇది అందరికీ చాలా అవసరం అని యమహా భావిస్తుంది. ఈ మహమ్మారి అంటు వ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని ఆయన అన్నారు.
యమహా ఇటీవల తన రెండు టీఎస్ బైకులను విడుదల చేసింది. అవి బిఎస్ 6 ఎఫ్ జెడ్ 25 మరియు ఎఫ్ జెడ్ ఎస్ 25. ఈ రెండు బైక్ల సమాచారం కంపెనీ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెండు బైక్లు విడుదల కానున్నాయి.
MOST READ:లాక్డౌన్ ఉల్లంఘించి డ్రగ్స్ కోసం 100 కి.మీ ప్రయాణించిన యువకునికి ఏం జరిగిందంటే ?
కొత్త బిఎస్ 6 ఎఫ్ జెడ్ 25 మరియు ఎఫ్ జెడ్ ఎస్ 25 బైక్ల ఇంజిన్ల విషయానికొస్తే, ఈ ఇంజన్లు బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడ్డాయి. 249 సిసి ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్సి, 4 స్ట్రోక్ సిగ్నల్ సిలిండర్ ఇంజన్లు ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.
ఈ రెండు యమహా నేకెడ్ బైక్లలో పునరుద్దరించబడిన బై-ఫంక్షనల్ ఎల్ఇడి హెడ్లైట్, ఎల్ఇడి డే-టైమ్ రన్నింగ్ లాంప్, మునుపటి కంటే పదునైన డిజైన్, మల్టీ-ఫంక్షన్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అండర్కప్లింగ్ మరియు మిడ్షిప్ మఫ్లర్ కవర్లు ఉన్నాయి.
MOST READ:విమానాల బుకింగ్స్ కోసం కొత్త మిషన్ స్టార్ట్ చేసిన ఎయిర్ ఇండియా, ఏంటో తెలుసా..?