Just In
- 1 hr ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 3 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 5 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Movies లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ దివి... ఓన్లీ మగవారి కోసమే అంటూ!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇందుకోసం లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయబోతోంది. ఇలా కొనుగోలు చేసిన వాహనాలను ప్రభుత్వం తమ ఉద్యోగులకు అందించనుంది.
ఈ ప్రణాళిక కోసం దేశీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఇఎమ్ఐ ప్రాతిపదికన తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించే ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది.
ఈ పథకం కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఉద్యోగులు మాత్రమే కాకుండా, సహకార సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు పెన్షనర్లను కూడా కవర్ చేస్తుంది. వివిధ సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే తమ ఉద్యోగులకు అందుబాటులో ఉంచనుంది.
MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఒకే ఛార్జీపై 40-100 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తాయి. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై మూడేళ్ల పాటు ఎలాంటి మెయింటినెన్స్ చార్జీలను వసూలు చేయరు. అంతేకాకుండా, సాధారణ పెట్రోల్ టూవీలర్లతో పోల్చుకుంట, ఈ ఎలక్ట్రిక్ టూవీలర్లు సున్నా ఉద్ఘారాలను విడుదల చేస్తాయి.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు పర్యావరణ సాన్నిహిత్యమైన రవాణా సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయటానికి వీలుగా సున్నా వడ్డీ రేట్లను మరియు 24 నుండి 60 నెలల వరకు అందుబాటులో ఉన్న ఈఎమ్ఐ స్కీమ్లను ప్రభుత్వం అందించనుంది.
MOST READ:కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) ఈ ప్రాజెక్టులో గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన ఈవీ విధానాన్ని కూడా విడుదల చేసింది. సప్లయ్ మరియు డిమాండ్ వైపుల నుండి ఇ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థ యొక్క వాటాదారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో ఈవీ పార్కులను అభివృద్ధి చేయడానికి 500 నుండి 1,000 ఎకరాల భూమిని కేటాయించాలనే ప్రతిపాదనను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో అంతర్గత మౌలిక సదుపాయాలు, సాధారణ సౌకర్యాలు మరియు బాహ్య మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి.
MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన ఆటో క్లస్టర్లు మరియు ఆటోమోటివ్ సప్లయర్స్ తయారీ కేంద్రాల డెవలపర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడిపై 50 శాతం ఆర్థిక సహాయం అందిస్తుంది. అలా కాకుండా, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఫ్యూయెల్ ఫిల్లింగ్ మౌలిక సదుపాయాలకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థలపై పనిచేస్తోంది. అదే ఏజెన్సీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన సప్లయర్స్ నుండి టెండర్లను కూడా కోరిందని కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామన్ రెడ్డి తెలిపారు.
MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
ఇటీవల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబులెన్సులు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాహనాలు మరియు చెత్త పికప్ ట్రక్కుల వంటి నాలుగు చక్రాలు మరియు ట్రక్కులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసిన విషయం తెలిసినదే. ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు గ్రామ సచివాలయంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.