Just In
- 1 hr ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 2 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 16 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 19 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- News టీడీపీ హ్యాట్రిక్ కు వైసీపీ యువనేత బ్రేకులు వేస్తారా..!!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇందుకోసం లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయబోతోంది. ఇలా కొనుగోలు చేసిన వాహనాలను ప్రభుత్వం తమ ఉద్యోగులకు అందించనుంది.
ఈ ప్రణాళిక కోసం దేశీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఇఎమ్ఐ ప్రాతిపదికన తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించే ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది.
ఈ పథకం కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఉద్యోగులు మాత్రమే కాకుండా, సహకార సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు పెన్షనర్లను కూడా కవర్ చేస్తుంది. వివిధ సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే తమ ఉద్యోగులకు అందుబాటులో ఉంచనుంది.
MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఒకే ఛార్జీపై 40-100 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తాయి. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై మూడేళ్ల పాటు ఎలాంటి మెయింటినెన్స్ చార్జీలను వసూలు చేయరు. అంతేకాకుండా, సాధారణ పెట్రోల్ టూవీలర్లతో పోల్చుకుంట, ఈ ఎలక్ట్రిక్ టూవీలర్లు సున్నా ఉద్ఘారాలను విడుదల చేస్తాయి.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు పర్యావరణ సాన్నిహిత్యమైన రవాణా సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయటానికి వీలుగా సున్నా వడ్డీ రేట్లను మరియు 24 నుండి 60 నెలల వరకు అందుబాటులో ఉన్న ఈఎమ్ఐ స్కీమ్లను ప్రభుత్వం అందించనుంది.
MOST READ:కేవలం 2 సెకన్లకు ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.. చూడండి
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) ఈ ప్రాజెక్టులో గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన ఈవీ విధానాన్ని కూడా విడుదల చేసింది. సప్లయ్ మరియు డిమాండ్ వైపుల నుండి ఇ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థ యొక్క వాటాదారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో ఈవీ పార్కులను అభివృద్ధి చేయడానికి 500 నుండి 1,000 ఎకరాల భూమిని కేటాయించాలనే ప్రతిపాదనను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో అంతర్గత మౌలిక సదుపాయాలు, సాధారణ సౌకర్యాలు మరియు బాహ్య మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి.
MOST READ:కరోనా నేపథ్యంలో కలర్ స్టిక్కర్స్.. ఏ వాహనానికి ఏ స్టిక్కర్ అంటే?
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన ఆటో క్లస్టర్లు మరియు ఆటోమోటివ్ సప్లయర్స్ తయారీ కేంద్రాల డెవలపర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడిపై 50 శాతం ఆర్థిక సహాయం అందిస్తుంది. అలా కాకుండా, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఫ్యూయెల్ ఫిల్లింగ్ మౌలిక సదుపాయాలకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థలపై పనిచేస్తోంది. అదే ఏజెన్సీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన సప్లయర్స్ నుండి టెండర్లను కూడా కోరిందని కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామన్ రెడ్డి తెలిపారు.
MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
ఇటీవల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబులెన్సులు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాహనాలు మరియు చెత్త పికప్ ట్రక్కుల వంటి నాలుగు చక్రాలు మరియు ట్రక్కులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసిన విషయం తెలిసినదే. ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు గ్రామ సచివాలయంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.