Just In
- 11 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఢిల్లీలో ఏథర్ 450ఎక్స్ డెలివరీ స్టార్ట్.. హీరో చైర్మన్కి మొదటి యూనిట్
భారతమార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైన సంగతి తేలింది. అయితే ప్రస్తుతం ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చాలా కొత్త నగరాల్లో ప్రారంభమయ్యాయి.
ఏథర్ 450 ఎక్స్ డెలివరీలు ఇప్పుడు దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ప్రారంభమైంది. ఢిల్లీలో ప్రారంభమైన ఈ ఏథర్ 450 ఎక్స్ యొక్క మొదటి యూనిట్ను హీరో మోటోకార్ప్ సిఇఒ డాక్టర్ పవన్ ముంజాల్ సొంతం చేసుకున్నారు. హీరోకి ఈథర్ ఎనర్జీలో దాదాపు 35 వాటా హీరో కంపెనీకి ఉంది.
ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ఈ మొదటి ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను హీరో మోటోకార్ప్ సిఇఒ పవన్ ముంజల్కు కేటాయించారు. దీనితో ఢిల్లీ నగరంలో 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని కంపెనీ ప్రారంభించింది, ఇది రాబోయే రోజుల్లో సాధారణ వినియోగదారులకు పంపిణీ చేయబడుతుంది.
MOST READ:ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ
ఈ సందర్భంగా ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా మాట్లాడుతూ, మేము ఇంతకు ముందే ఈ ఏథర్ 450 ఎక్స్ ను మార్కెట్లలో లాంచ్ చేసాము. అయితే ఇప్పుడు న్యూ ఢిల్లీలో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రారంభ సమయంలో, మేము మా మొదటి యూనిట్ డాక్టర్ పవన్ ముంజల్ ను అప్పగించడం చాలా సంతోషంగా ఉంది.
దీని గురించి హీరో మోటోకార్ప్ సిఈఓ డాక్టర్ పవన్ ముంజాల్ మాట్లాడుతూ, తరుణ్ చేతుల మీదుగా ఈ ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మనషి ప్రజాదరణ పొందింది. ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ మరియు మంచి మైలేజ్ వంటివి ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో మంచి విక్రయాలతో ముందు వెళ్తోంది అన్నారు.
MOST READ:సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!
హీరోకి ఏథర్ ఎనర్జీతో 2016 నుంచి సుమారు 35 శాతం వాటా ఉంది. ఏథర్ కొన్ని నెలల క్రితం తన 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకువచ్చింది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశించినప్పటి నుంచి బాగా అమ్ముడవుతోంది, ఈ స్కూటర్ ద్వారా దేశవ్యాప్తంగా కొత్త మార్కెట్లోకి విస్తరించాలని కంపెనీ కోరుకుంటుంది.
ఇప్పుడు ఇది ఫేజ్-2 కింద ఢిల్లీ, ముంబై, పూణేతో సహా పలు కొత్త నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ మరియు టెస్ట్ రైడ్లు ప్రారంభించబడుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో మరిన్ని నగరాల్లో విస్తరించబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?
కొత్త నగరాల్లో, వినియోగదారులు ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోకుండా ఏథర్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ గ్రిడ్లను నిర్మించడం ప్రారంభించారు. నవంబర్లోనే 7 కొత్త నగరాల్లో కంపెనీ స్కూటర్ను విడుదల చేసింది. ఈ కొత్త నగరాల్లో 27 కొత్త డీలర్షిప్లను కంపెనీ ప్రారంభించబోతోంది.
ఈ కొత్త నగరాల్లో మైసూర్, హుబ్లి, జైపూర్, ఇండోర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్, సూరత్, చండీగర్, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, నాగ్పూర్, నోయిడా, లక్నో మరియు సిలిగురి మొదలైనవి ఉన్నాయి. సంస్థ తన కొత్త ప్లాంట్ను జనవరిలో ప్రారంభించింది మరియు ఈ మూడు నెలల్లోనే అనేక కొత్త నగరాలకు డెలివరీలను ప్రారంభిస్తుంది.
MOST READ:రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?
ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా వరకు పెరిగిపోతున్న కారణంగా, వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ, రాయితీలను కూడా కల్పిస్తోంది.