Just In
- 3 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 3 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 6 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2021 మార్చి అమ్మకాల్లో సత్తా చాటిన బజాజ్ ఆటో; వివరాలు
2021 మార్చి నెల ముగిసింది. ఈ నేపథ్యంలో ఆటో పరిశ్రమలోని అన్ని వాహన తయారీదారులు తమ అమ్మకాల నివేదికను విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ మార్చి 2021 అమ్మకాల నివేదికను విడుదల చేసింది. బజాజ్ ఆటో యొక్క అమ్మకాలు మార్చి నెలలో ఏవిధంగా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. రండి.
బజాజ్ ఆటో విడుదల చేసిన అమ్మకాల నివేదికలో మార్చిలో 56 శాతం వృద్ధిని సాధించినట్లు తెలుస్తుంది. అంటే గత మార్చి నెలలో కంపెనీ మొత్తం 3,30,133 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 2,10,976 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
గత ఏడాది మార్చి నెలలో అమ్మిన 98,412 యూనిట్లతో పోలిస్తే 84 శాతం పెరుగుదలతో కంపెనీ దేశీయ మార్కెట్లో 1,81,393 యూనిట్లను విక్రయించినాట్లు అధికారికంగా తెలిపింది. ఏది ఏమైనా గత నెల మంచి అమ్మకాలతో అభివృద్ధివైపు పరుగులు తీసింది.
ఇప్పుడు బజాజ్ ఆటో యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, గత నెలలో కంపెనీ 1,48,740 యూనిట్లను ఎగుమతి చేసింది. అయితే గత ఏడాది మార్చిలో 1,12,564 యూనిట్లను ఎగుమతి చేసింది. గత 2021 మార్చిలో బజాజ్ బైకుల ఎగుమతులు కూడా 32 శాతం వరకు పెరిగాయి.
గత ఏడాది అధికంగా విజృంభించిన కరోనా మహమ్మారిని నివారయించడానికి కరోనా లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో వాహన అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. లాక్ డౌన్ కారణంగా చాలా రోజులపాటు ఉత్పత్తులు మరియు అమ్మకాలు నిలిపివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లేదు కావున మార్చి నెలలో అన్ని ఆటో మొబైల్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి.
MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్
2020 సంవత్సరం నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక సంవత్సరం మొత్తం జరిగిన అమ్మకాల విషయానికి వస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఆటో 39,47,568 యూనిట్లను విక్రయించింది.
అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 36,05,893 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తంమీద, బజాజ్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 9 శాతం తగ్గాయి. అయితే ఇకపై కంపెనీ తమ అమ్మకాలను పెంచడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది.
MOST READ:గిఫ్ట్గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?
ప్రస్తుతం ప్రారంభమైన 2021-2022 కొత్త ఆర్థిక సంవత్సరంలో బజాజ్ అప్డేట్ చేసిన పల్సర్ 220 ఎఫ్, పల్సర్ 150 మరియు పల్సర్ 250 తో సహా పలు కొత్త బైక్ మోడళ్లను విడుదల చేయనుంది. బజాజ్ కంపెనీ గత నెలలో ప్లాటినా 100 ఇఎస్ మరియు 100 సిసి ప్లాటినాను కూడా అప్డేట్ చేసింది.
అంతే కాకుండా ఈ పల్సర్ 150, పల్సర్ 180 బైకులు కొత్త కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని సిద్ధం చేస్తుంది. బజాజ్ ఆటో కొత్త పల్సర్ 200 యొక్క టీజర్ను ఇటీవల విడుదల చేసింది, ఈ బైక్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పల్సర్ 250 టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది పల్సర్ రేంజ్లో అత్యంత శక్తివంతమైన బైక్ కానుంది.
MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన ‘గాతిమాన్ ఎక్స్ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ బైక్ పండుగ సమయంలో విడుదయ్యే అవకాశం ఉంది. త్వరలో రానున్న కొత్త పల్సర్ 250 బైక్ లో సరికొత్త ఇంజిన్ను ఉపయోగించనుంది. పల్సర్ 250 లో ఉపయోగించే ఇంజిన్ ఎయిర్ కూల్డ్ అవుతుందని తెలుస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే ఆటో పరిశ్రమ కొంత కోలుకుంటోంది.