Just In
- 3 hrs ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 6 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 8 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 8 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు
భారతదేశపు అతిపెద్ద బైక్ రెంటల్ కంపెనీ స్మార్ట్ బైక్, ఇటీవల చెన్నైలో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ సైకిల్ మరియు కొత్త తరం బైక్లను విడుదల చేసినట్లు తెలిసింది. ఈ కంపెనీ యొక్క రెంటల్ వెహికల్స్ చెన్నైలోని ప్రధాన మెట్రో స్టేషన్లలో లభిస్తాయి. ఈ నగరాలలో ఆఫీసు వెళ్లేవారు మరియు ఇతరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వీస్ గతంలో ప్రారంభించారు.
ఈ సర్వీస్ కాస్త విస్తరించడానికి స్మార్ట్ బైక్ ఇప్పుడు చెన్నైలో కొత్త సిరీస్ వాహనాలను విడుదల చేసింది. ఈ వాహనాలు గత 28 రోజులుగా సర్వీస్ లో ఉన్నాయి. మెరీనా బీచ్లోని కామరాజ్ రోడ్డులో తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి మరియు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ వాహనాలను నడిపారు.
అంతే కాకుండా తమిళనాడు రాష్ట్రంలో పలువురు మంత్రులు, చెన్నైకి చెందిన ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరయ్యారు. ఈ వాహనాలను ప్రస్తుతం చెన్నైలోని 10 ప్రధాన ప్రదేశాలలో మాత్రమే మోహరిస్తున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాలలో 90 కి పైగా కొత్త వాహనాలు త్వరలో సర్వీస్ లో అందుబాటులో ఉంటాయి.
MOST READ:పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి
దీని కోసం 1000 కి పైగా వాహనాలను సిద్ధం చేసినట్లు కూడా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడులో వాడుకలో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ళు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఈ వాహనం పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 50 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు.
ఈ వాహనాలు అందరికి చాలా బాగా ఉపయోగపడుతున్నప్పటికీ, ఈ వెహికల్ రెంట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది. కొత్త తరం వాహనంగా ప్రవేశపెట్టిన సైకిళ్ళు చైన్ లేకుండా డ్రైవ్ చేయవచ్చు.
MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి
ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మెగ్నీషియం అల్లాయ్ వీల్, ట్యూబ్ లెస్ టైర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్మార్ట్ బైక్ అనే మొబైల్ యాప్ ద్వారా ఈ సేవను స్మార్ట్ బైక్ కంపెనీ అందిస్తోంది. వాహనాలను అద్దెకు ఇవ్వడం, ఉపయోగించిన తర్వాత వాటిని అప్పగించడం, బిల్లు చెల్లింపు ఈ అప్లికేషన్ ద్వారా చేయవచ్చు. పేపర్లెస్ ట్రేడింగ్కు ఇందులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
స్మార్ట్ బైక్ ఈ సేవను చెన్నైలోనే కాకుండా భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా అందిస్తుంది. స్మార్ట్ బైక్ కంపెనీ వాహనాలు ఢిల్లీ, హైదరాబాద్ మరియు చండీగర్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరోజు ఆఫీస్ వంటి వాటికి వెళ్లే వారికీ చాలా సులభంగా ఉపయోగపడుతుంది.
MOST READ:2021 కేంద్ర బడ్జెట్లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు
త్వరలో మరిన్ని నగరాలకు సర్వీస్ అందించాలని కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది. చెన్నైలో కొత్త తరం సైకిళ్ళు మరియు ఎలక్ట్రిక్ సైకిళ్ల నుండి ఐటి ఉద్యోగులు మరియు ఇతర ఉద్యోగులు లబ్ది పొందాలని భావిస్తున్నారు. ఇవి ఈ ఆధునిక యుగానికి సరిపోయే విధంగా జరిపింది.